పేద, మద్యతరగతి ప్రజలకు గృహ సదుపాయం కల్పించనున్న సౌదీ ప్రభుత్వం
- December 12, 2017_1513090270.jpg)
సౌదీ అరేబియా: ఆర్ధిక ఇబ్బందులతో సతమవుతున్న సౌదీ అరేబియాలో ఆర్థిక సంస్కరణలు అమలు జరపబోతున్నామని సౌదీ ప్రభుత్వం ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు భారీగా తగ్గడంతో దేశ ఆర్థిక వ్యవస్థ కుంటుపడిందని ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా పెద్ద ఎత్తున ఆయిల్ ఎగుమతుల్ని జరగనీయకుండా నిలువరించింది. దాంతో ఎన్నో చమురు కంపెనీలు తీవ్రంగా నష్టపోయాయి. అలాగే పేద, మద్యతరగతి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రజలకు శుభవార్త చెబుతూ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. పేద, మద్యతరగతి వారికి గృహ సదుపాయం కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ డిసెంబర్లోనే ఈ పథకాన్ని అమలు చేయనున్నామని ప్రభుత్వం చెబుతోంది. నగదు రూపంలో ఇంటి యజమానికి ప్రభుత్వం హౌజింగ్ అలవెన్స్ చెక్ అందిస్తుందని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!