పేద, మద్యతరగతి ప్రజలకు గృహ సదుపాయం కల్పించనున్న సౌదీ ప్రభుత్వం
- December 12, 2017
సౌదీ అరేబియా: ఆర్ధిక ఇబ్బందులతో సతమవుతున్న సౌదీ అరేబియాలో ఆర్థిక సంస్కరణలు అమలు జరపబోతున్నామని సౌదీ ప్రభుత్వం ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు భారీగా తగ్గడంతో దేశ ఆర్థిక వ్యవస్థ కుంటుపడిందని ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా పెద్ద ఎత్తున ఆయిల్ ఎగుమతుల్ని జరగనీయకుండా నిలువరించింది. దాంతో ఎన్నో చమురు కంపెనీలు తీవ్రంగా నష్టపోయాయి. అలాగే పేద, మద్యతరగతి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రజలకు శుభవార్త చెబుతూ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. పేద, మద్యతరగతి వారికి గృహ సదుపాయం కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ డిసెంబర్లోనే ఈ పథకాన్ని అమలు చేయనున్నామని ప్రభుత్వం చెబుతోంది. నగదు రూపంలో ఇంటి యజమానికి ప్రభుత్వం హౌజింగ్ అలవెన్స్ చెక్ అందిస్తుందని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







