‘చంద్రన్న విలేజ్మాల్’ను ప్రారంభించిన చంద్రబాబు
- December 12, 2017
అమరావతి: విజయవాడ, గుంటూరులో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన ‘చంద్రన్న విలేజ్మాల్’ను సచివాలయం నుంచి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. పేదలకు నాణ్యమైన వస్తువులను అత్యంత చౌక ధరలకు అందించాలనే లక్ష్యంతో ‘చంద్రన్న విలేజ్మాల్’లు రాష్ట్రమంతటా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో 28వేలకు పైగా ఉన్న చౌకధరల దుకాణాలను చంద్రన్న విలేజ్మాల్గా నవీకరిస్తున్నామని, మొదటి దశలో 6,500 రేషన్ షాపులు అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. పేదలకు ప్రభుత్వం అందించే బియ్యం బదులుగా అంతే విలువకు కావాల్సిన వస్తువులు ఇస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు. ఇందుకు అవసరమైన వస్తువుల సరఫరాకు మండలం, నియోజకవర్గం స్థాయిలో డిపోలు ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. నిత్యావసర వస్తువులతో పాటు గృహోపకరణాలు, కిరణా సరకులు, సౌందర్య సాధనాలను మాల్లో విక్రయిస్తారని తెలిపారు. వివిధ బ్రాండ్లకు చెందిన 500కు పైగా ఉత్పత్తులు ఎంఆర్పీ కన్నా 4 నుంచి 35శాతం తక్కువ ధరకు లభిస్తాయని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







