దుబాయిలోని విల్లా లో అగ్నిప్రమాదం - తొమ్మిది మందికి గాయాలు
- November 16, 2015దుబాయిలోని మిర్దిఫ్ ఏరియా లోని ఒక విల్లా లో జరిగిన అగ్నిప్రమాదంలో సోమవారం తొమ్మిది మంది గాయాలపాలయ్యారు. ఈ సంఘటనను గురించి సమాచారమందుకున్న దుబాయ్ సివిల్ డిఫెన్స్ ఆపరేషన్ రూం, పోలీసులు మరియు అగ్నిమాపక సిబ్బందితో కూడిన రక్షణ దళం, వెంటనే ప్రమాద స్థలానికి చేరుకొని అక్కడ అగ్ని ప్రమాదం జరిగిన మూడంతస్తుల భవంతిని, అందులో చిక్కుకున్న వ్యక్తులను కనుగొన్నారు. కేవలం 15 నిముషాల వ్యవధిలో పక్క భవనాలకు వ్యాప్తించకుండా మంటలను ఆర్పివేసి, భవనం లో వారికీ, పక్క భవనాలకు ప్రమాదం జరగకుండా కాపాడారు. తన గదిలో చిక్కుకుపోయిన ఒక సేవకురాలు తీవ్ర గాయాలకు గురి కాగా, తప్పించుకోవడానికి మొదటి అంతస్తు నుండి దూకిన ఇద్దరి కాళ్ళు విరిగినట్టు పొలిసు వారు తెలిపారు. గాయపడినవారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







