నగర వాసుల్ని కలిసి బాదేద్దాం.. మెట్రో ఓలా చెట్టపట్టాల్
- December 13, 2017
హైదరాబాద్ మెట్రో రైల్ నిర్మించిన ఎల్ అండ్ టీ సంస్థ ఓలా క్యాబ్స్తో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 'టీసవారి' అంటూ ఓ యాప్ని ప్రయాణీకుల ముందుకు తెచ్చింది. ఈ యాప్లో ఓలా మనీతో పాటు ఓలా సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. ఈ యాప్ నుంచే ఓలాకు సంబంధించిన వాహనాల్ని బుక్ చేసుకోవచ్చు. మెట్రో స్మార్ట్ కార్డులను కూడా ఓలా మనీ వ్యాలెట్ ద్వారా రీచార్జ్ చేసుకోవచ్చు. ఈ సందర్భంగా మెట్రో రైల్ సీఈవో అనిల్ కుమార్ శైనీ మాట్లాడుతూ, ఓలాతో ఒప్పందం చేసుకోవడం సంతోషంగా ఉందని, ఈ సదుపాయం వల్ల ప్రయాణికులకు స్టేషన్కు రావడానికి, వెళ్లడానికి ఈజీగా ఉంటుందని చెప్పారు. ఊహించినట్లుగానే మెట్రోకు మంచి స్పందన లభిస్తోందని తెలిపారు.
తాజా వార్తలు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!