ఒక్క రూపాయితో విమానం ఎక్కేయొచ్చు.. చక్కర్లు కొట్టేయొచ్చు
- December 13, 2017
డెక్కన్ ఎయిర్ వేస్ ఓ శుభవార్త చెప్పింది. విమానం ఎక్కాలన్న కోరికను తీర్చేస్తానంటోంది. బ్యాంకులకు భారీ మొత్తంలో రుణాలు ఎగ్గొట్టి విదేశాలు చెక్కేసిన విజయ్ మాల్యా కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ విలీనం, సంక్షోభం వీటి మధ్య 2012లో తన కార్యకలాపాలు మూసివేసింది. ఇప్పుడు మళ్లీ ఈ ఎయిర్ లైన్స్ వెలుగులోకి వచ్చి కార్యకలాపాలను ప్రారంభిస్తోంది. తమ కస్టమర్లకు రూ.1కే విమాన టికెట్ను ఆఫర్ చేస్తోంది. ఈ విమానం ఈనెల 22న గాల్లోకి ఎగరనుంది. నాసిక్ నుంచి ముంబైకి ఈ సర్వీసును ప్రారంభించనున్నామని కెప్టెన్ గోపీనాథ్ తెలిపారు. అదృష్టవంతులు ఎవరో టిక్కెట్ని చేజిక్కించుకోమంటుంది. ముందు వచ్చిన వారికే అవకాశం అంటూ ఇందులో ఉన్న మతలబు తెలియజేసింది.
తాజా వార్తలు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!