టీడీపీకి గుడ్ బై చెప్పనున్న యలమంచిలి రవి
- December 14, 2017
కృష్ణా జిల్లాలో టీడీపీకి గట్టి షాక్ తగలబోతోంది. జిల్లాలో లక్షలాది మంది క్యాడర్ కలిగిన బలమైన నాయకుడు, మాజీ MLA యలమంచిలి రవి, తెలుగుదేశానికి గుడ్బై చెప్పి వైసీపీలో చేరబోతున్నారు. జగన్ పాదయాత్ర విజయవాడ వచ్చినప్పుడు రవి వైసీపీలో చేరతారని అనుచరులు చెప్తున్నారు. TDP నేతలు బుజ్జగించేందుకు ప్రయత్నించినా ఆయన వైసీపీలో చేరాలనే నిర్ణయానికి వచ్చారు.
కృష్ణా జిల్లా రాజకీయాల్లో యలమంచిలి కుటుంబానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. జిల్లాలో బలమైన క్యాడర్ ఉన్న నాయకుల్లో రవి ఒకరు. గతంలో రవి తండ్రి యలమంచిలి నాగేశ్వర్రావు కూడా MLAగా పనిచేశారు. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు కంకిపాడు నుంచి దేవినేని నెహ్రూపై నాగేశ్వర్రావు MLAగా గెలిచారు. 2009లో ఆయన తనయుడు రవి PRP నుంచి పోటీ చేసి విజయవాడ తూర్పు MLAగా విజయం సాధించారు. రవి కూడా నెహ్రూపైనే గెలవడం విశేషం. జిల్లాలో బలమైన క్యాడర్ ఉన్న రవి ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలతో ఆయన పార్టీ మారాలని నిర్ణయానికి వచ్చారు. త్వరలోనే జగన్ సమక్షంలో ఆయన YCP తీర్థం పుచ్చుకుంటారని సన్నిహితులు చెప్తున్నారు.
తాజా వార్తలు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!