ఇస్లామిక్ సహకార సంస్థ అసాధారణ సమావేశంలో పాల్గొన్న శ్రీ ఎమిర్
- December 14, 2017
మస్కట్ : ఇస్లామిక్ సహకార సంస్థ అసాధారణ సమావేశంలో శ్రీ ఎమిర్ షేక్ తమిం బిన్ హమద్ అల్-థని పాల్గొన్నారు, బుధవారం ఉదయం ఇస్తాంబుల్ లోని కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించిన ఇస్లామిక్ సహకార సంస్థ (ఓ ఐ సి ) యొక్క అసాధారణ సదస్సు ప్రారంభ సమావేశంలో అధికారిక ప్రతినిధి బృందం పాల్గొంది. ఇజ్రాయెల్ రాజధానిగా జెరూసలేం గుర్తించాలని అమెరికా పరిపాలన శాఖ యొక్క నిర్ణయం తద్వారా తలెత్తుతున్న పరిణామాలు ఈ సమావేశంలో చర్చించారు. టర్కిష్ విదేశాంగ మంత్రి మేవ్లుట్ కావస్సోలు ఇస్లామిక్ సహకార సంస్థ (ఓ ఐ సి) సంస్థ "నియంతృత్వానికి నిలుపుదల " చేస్తున్నట్లు చెప్పడానికి నేడు సమావేశమయ్యామని ఆయన చెప్పారు. ఇజ్రాయెల్ యొక్క రాజధానిగా ఉన్న అల్ ఖుద్స్ ని కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ రాజధానిగా జెరూసలేంకు గుర్తింపు ఇవ్వడం మానవ మనస్సాక్షికి వ్యతిరేకంగా ఒక హానికరమైన చర్యగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ దశలో అమెరికా ఇజ్రాయెల్ యొక్క జెరూసలేంను ఆక్రమించేందుకు చేసిన ప్రయత్నాలను చట్టబద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని దుయ్యబట్టారు."ఇస్లామిక్ దేశాలు ఈ ప్రకటనతో నిశ్శబ్దంగా ఉంటుందని అమెరికా భావిస్తుందని వారు అనుకున్నట్లు మనం నిశ్శబ్దంగా ఉండకూడదు, అగ్ర రాజ్యాంగా ఉన్నామని విర్రవీగుతూ ఈ బెదిరింపులు శాంతి అవకాశాన్ని తొలగిస్తుంది అమెరికా సంయుక్త నిర్ణయం మనకు సంబంధించినంతవరకు శూన్యంగా ఉంది, "అని కావస్సోగ్లు చెప్పారు.పాలస్తీనియన్లు జాతీయ సయోధ్య మరియు ఐక్యతలను సాధించడానికి ఇస్లామిక్ సహకార సంస్థ (ఓ ఐ సి) సంస్థ ప్రాముఖ్యతను ఈ సందర్భంగా ఆయన నొక్కి చెప్పారు.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







