అంజలి, రాయ్ లక్ష్మి ప్రధాన పాత్రధారులుగా యదార్ధ సంఘటన ఆధారంగా సినిమా..
- December 15, 2017
గుంటూరు టాకీస్, రాజా మీరు కేక వంటి వినోదాత్మక చిత్రాలను, షూటింగ్ దశలో ఉన్న పవనిజం-2 వంటి చిత్రాలను తెరకెక్కించిన ఆర్కె స్టూడియోస్ బ్యానర్ పై ఎమ్. రాజ్కుమార్ గారు నిర్మాతగా, నంది అవార్డు గ్రహీత కర్రి బాలాజీ దర్శకత్వంలో.. గీతాంజలి, చిత్రాంగద వంటి చిత్రాలతో మంచి నటిగా పేరు తెచ్చుకున్న అంజలి, కాంచన సినిమాతో మాంచి ఫేమ్ సంపాదించిన రాయ్ లక్ష్మి ముఖ్య పాత్రల్లో త్వరలోనే ఒక సరికొత్త చిత్రం ప్రారంభం కానుంది. కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా, వినూత్నమైన సోషల్ ఎలిమెంట్స్ తో కూడిన కథతో, వినోదం మరియు ఉత్కంఠభరితమైన కథనంతో ఈ చిత్రం ఉండబోతుందని దర్శకనిర్మాతలు తెలియపరిచారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
అంజలి, రాయ్ లక్ష్మి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో సాయి కుమార్, నరేష్, శివప్రసాద్, ధన్రాజ్, జాకీ, అశోక్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి, సంగీతం: మణిశర్మ, సినిమాటోగ్రఫీః పి.జి విందా, ఎడిటింగ్ః తమ్మిరాజు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ః దత్తి సురేష్ కుమార్, ప్రొడ్యూసర్ః ఎమ్. రాజ్కుమార్, కథ, కథనం, దర్శకత్వం: కర్రి బాలాజీ
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







