మిస్టర్ ఇండియా టైటిల్ గెలిచిన జితేశ్ సింగ్ దేవ్
- December 15, 2017
మిస్టర్ ఇండియా 2017 టైటిల్ను ఉత్తర్ప్రదేశ్కు చెందిన జితేశ్ సింగ్ దేవ్ గెలుచుకున్నాడు. ముంబైలోని బాంద్రా ఫోర్ట్లో గురువారం సాయంత్రం పీటర్ ఇంగ్లాండ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మిస్టర్ ఇండియా 2017 పోటీల్లో 17 మంది పాల్గొన్నారు. ఈ పోటీల్లో విజేతగా నిలిచిన జితేశ్ సింగ్ దేవ్కు మిస్టర్ వరల్డ్ 2020 పోటీల్లో భారత్ తరఫున పాల్గొనే అవకాశం కలిగింది. అలాగే మిస్టర్ ఇండియా సూప్రనేషనల్గా ప్రతమేశ్ మౌలింకర్ నిలిచారు. సూప్రనేషనల్ 2018 పోటీల్లో ప్రతమేశ్ పాల్గొననున్నారు. ఈ పోటీల్లో అభి ఖాజురియా, పవన్ రావ్లు మొదటి, రెండో రన్నరప్లుగా నిలిచారు. 17 మంది పాల్గొన్న ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బాలీవుడ్ నటి కంగనా రనౌత్ బహుమతులు అందజేశారు.గతేడాది మిస్టర్ వరల్డ్గా హైదరాబాద్కు చెందిన రోహిత్ ఖండ్వేలాల్ విజేతగా నిలిచి, భారత్ తరఫున ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తిగా గుర్తింపు పొందాడు. మిస్టర్ ఇండియా 2017గా నిలవడంపై జితేశ్ సంతోషం వ్యక్తం చేశాడు. అంతకు ముందు న్యాయ నిర్ణేతలు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ. తనకు అవకాశం లభిస్తే 17 ఏళ్ల తర్వాత భారత్కు ప్రపంచ సుందరి కిరీటం తెచ్చిపెట్టిన మానుషీ చిల్లార్ మాదిరిగా దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేస్తానని అన్నారు. ఈ పోటీల్లో నటి కంగనా రనౌత్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







