'మెంటల్ మదిలో' తర్వాత.. బ్రోచేవారెవరురా!
- December 15, 2017
'పెళ్ళిచూపులు' సినిమాతో నిర్మాతగా మంచి గుర్తింపు సంపాదించాడు రాజ్ కందుకూరి. ఈ సినిమా తర్వాత హడావుడి పడకుండా ఏడాది విరామం తీసుకుని 'మెంటల్ మదిలో' సినిమా మొదలుపెట్టాడు. వివేక్ ఆత్రేయ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్రం గత నెలలోనే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మంచి రివ్యూలు.. పర్వాలేదనిపించే వసూళ్లు వచ్చాయి.
ఇప్పుడు ఇదే చిత్ర బృందం 'బ్రోచేవారెవరురా' అనే సినిమాతో రాబోతోంది. 'మెంటల్ మదిలో' సినిమా అనాలసిస్ మీట్లో ఈ విషయాన్ని నిర్మాత రాజ్ కందుకూరి వెల్లడించాడు. సురేష్ బాబు సమర్పణలో తాను ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తానని.. వివేక్ ఆత్రేయ నిర్మిస్తాడని తెలిపాడు. ఈ చిత్రం క్రైమ్ థ్రిల్లర్ అని.. త్వరలోనే నటీనటులు.. సాంకేతిక నిపుణులు వివరాలు వెల్లడిస్తామని రాజ్ కందుకూరి చెప్పాడు.
ఇక 'మెంటల్ మదిలో' గురించి రాజ్ చెబుతూ.. ''ఈ సినిమా ఇప్పటికీ ఆదరణ పొందుతోంది. మంచి కంటెంట్ ఉంటే చిన్న పెద్ద తేడా లేకుండా ఏ సినిమానైనా ఆదరిస్తారనడానికి ఇది రుజువు. ఆ సెలబ్రేషన్లో భాగంగానే అనాలసిస్ మీట్ పెట్టాం. మా సినిమాపై ఎవరైనా తమ అభిప్రాయం చెప్పొచ్చు. మా బేనర్లో వివేక్ తో మరో సినిమా చేస్తున్నామంటేనే ఈ సినిమా ఎలాంటి విజయం సాధించిందో అర్థం చేసుకోవచ్చు'' అని అన్నాడు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







