'మెంటల్ మదిలో' తర్వాత.. బ్రోచేవారెవరురా!
- December 15, 2017
'పెళ్ళిచూపులు' సినిమాతో నిర్మాతగా మంచి గుర్తింపు సంపాదించాడు రాజ్ కందుకూరి. ఈ సినిమా తర్వాత హడావుడి పడకుండా ఏడాది విరామం తీసుకుని 'మెంటల్ మదిలో' సినిమా మొదలుపెట్టాడు. వివేక్ ఆత్రేయ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్రం గత నెలలోనే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మంచి రివ్యూలు.. పర్వాలేదనిపించే వసూళ్లు వచ్చాయి.
ఇప్పుడు ఇదే చిత్ర బృందం 'బ్రోచేవారెవరురా' అనే సినిమాతో రాబోతోంది. 'మెంటల్ మదిలో' సినిమా అనాలసిస్ మీట్లో ఈ విషయాన్ని నిర్మాత రాజ్ కందుకూరి వెల్లడించాడు. సురేష్ బాబు సమర్పణలో తాను ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తానని.. వివేక్ ఆత్రేయ నిర్మిస్తాడని తెలిపాడు. ఈ చిత్రం క్రైమ్ థ్రిల్లర్ అని.. త్వరలోనే నటీనటులు.. సాంకేతిక నిపుణులు వివరాలు వెల్లడిస్తామని రాజ్ కందుకూరి చెప్పాడు.
ఇక 'మెంటల్ మదిలో' గురించి రాజ్ చెబుతూ.. ''ఈ సినిమా ఇప్పటికీ ఆదరణ పొందుతోంది. మంచి కంటెంట్ ఉంటే చిన్న పెద్ద తేడా లేకుండా ఏ సినిమానైనా ఆదరిస్తారనడానికి ఇది రుజువు. ఆ సెలబ్రేషన్లో భాగంగానే అనాలసిస్ మీట్ పెట్టాం. మా సినిమాపై ఎవరైనా తమ అభిప్రాయం చెప్పొచ్చు. మా బేనర్లో వివేక్ తో మరో సినిమా చేస్తున్నామంటేనే ఈ సినిమా ఎలాంటి విజయం సాధించిందో అర్థం చేసుకోవచ్చు'' అని అన్నాడు.
తాజా వార్తలు
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!







