'మెంటల్ మదిలో' తర్వాత.. బ్రోచేవారెవరురా!
- December 15, 2017
'పెళ్ళిచూపులు' సినిమాతో నిర్మాతగా మంచి గుర్తింపు సంపాదించాడు రాజ్ కందుకూరి. ఈ సినిమా తర్వాత హడావుడి పడకుండా ఏడాది విరామం తీసుకుని 'మెంటల్ మదిలో' సినిమా మొదలుపెట్టాడు. వివేక్ ఆత్రేయ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్రం గత నెలలోనే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మంచి రివ్యూలు.. పర్వాలేదనిపించే వసూళ్లు వచ్చాయి.
ఇప్పుడు ఇదే చిత్ర బృందం 'బ్రోచేవారెవరురా' అనే సినిమాతో రాబోతోంది. 'మెంటల్ మదిలో' సినిమా అనాలసిస్ మీట్లో ఈ విషయాన్ని నిర్మాత రాజ్ కందుకూరి వెల్లడించాడు. సురేష్ బాబు సమర్పణలో తాను ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తానని.. వివేక్ ఆత్రేయ నిర్మిస్తాడని తెలిపాడు. ఈ చిత్రం క్రైమ్ థ్రిల్లర్ అని.. త్వరలోనే నటీనటులు.. సాంకేతిక నిపుణులు వివరాలు వెల్లడిస్తామని రాజ్ కందుకూరి చెప్పాడు.
ఇక 'మెంటల్ మదిలో' గురించి రాజ్ చెబుతూ.. ''ఈ సినిమా ఇప్పటికీ ఆదరణ పొందుతోంది. మంచి కంటెంట్ ఉంటే చిన్న పెద్ద తేడా లేకుండా ఏ సినిమానైనా ఆదరిస్తారనడానికి ఇది రుజువు. ఆ సెలబ్రేషన్లో భాగంగానే అనాలసిస్ మీట్ పెట్టాం. మా సినిమాపై ఎవరైనా తమ అభిప్రాయం చెప్పొచ్చు. మా బేనర్లో వివేక్ తో మరో సినిమా చేస్తున్నామంటేనే ఈ సినిమా ఎలాంటి విజయం సాధించిందో అర్థం చేసుకోవచ్చు'' అని అన్నాడు.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







