'మెంటల్ మదిలో' తర్వాత.. బ్రోచేవారెవరురా!
- December 15, 2017
'పెళ్ళిచూపులు' సినిమాతో నిర్మాతగా మంచి గుర్తింపు సంపాదించాడు రాజ్ కందుకూరి. ఈ సినిమా తర్వాత హడావుడి పడకుండా ఏడాది విరామం తీసుకుని 'మెంటల్ మదిలో' సినిమా మొదలుపెట్టాడు. వివేక్ ఆత్రేయ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్రం గత నెలలోనే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మంచి రివ్యూలు.. పర్వాలేదనిపించే వసూళ్లు వచ్చాయి.
ఇప్పుడు ఇదే చిత్ర బృందం 'బ్రోచేవారెవరురా' అనే సినిమాతో రాబోతోంది. 'మెంటల్ మదిలో' సినిమా అనాలసిస్ మీట్లో ఈ విషయాన్ని నిర్మాత రాజ్ కందుకూరి వెల్లడించాడు. సురేష్ బాబు సమర్పణలో తాను ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తానని.. వివేక్ ఆత్రేయ నిర్మిస్తాడని తెలిపాడు. ఈ చిత్రం క్రైమ్ థ్రిల్లర్ అని.. త్వరలోనే నటీనటులు.. సాంకేతిక నిపుణులు వివరాలు వెల్లడిస్తామని రాజ్ కందుకూరి చెప్పాడు.
ఇక 'మెంటల్ మదిలో' గురించి రాజ్ చెబుతూ.. ''ఈ సినిమా ఇప్పటికీ ఆదరణ పొందుతోంది. మంచి కంటెంట్ ఉంటే చిన్న పెద్ద తేడా లేకుండా ఏ సినిమానైనా ఆదరిస్తారనడానికి ఇది రుజువు. ఆ సెలబ్రేషన్లో భాగంగానే అనాలసిస్ మీట్ పెట్టాం. మా సినిమాపై ఎవరైనా తమ అభిప్రాయం చెప్పొచ్చు. మా బేనర్లో వివేక్ తో మరో సినిమా చేస్తున్నామంటేనే ఈ సినిమా ఎలాంటి విజయం సాధించిందో అర్థం చేసుకోవచ్చు'' అని అన్నాడు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల