ఎలక్ర్టికల్, ఎలక్ట్రానిక్స్ రేట్లు పెరిగిపోతాయ్

- December 15, 2017 , by Maagulf
ఎలక్ర్టికల్, ఎలక్ట్రానిక్స్ రేట్లు పెరిగిపోతాయ్

మోదీ సర్కారు ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వస్తువుల దిగుమతులపై ఉక్కపాదం మోపుతోంది. ఇతరదేశాలనుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్న ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్‌ గూడ్స్ పై కస్టమ్స్‌ సుంకాన్ని పెంచుతున్నట్లు సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ఎక్సైజ్‌ అండ్‌ కస్టమ్స్‌ ప్రకటించింది. ఫలితంగా టీవీలు, మొబైల్‌ ఫోన్స్‌, సినిమా ప్రొజెక్టర్స్‌, వాటర్‌ హీటర్స్ వంటి వస్తువుల రేట్లు బాగాపెరిగిపోనున్నాయి. ప్రస్తుతం ఈ వస్తువుల పై దిగుమతి సుంకం10 శాతం ఉండగా, ఇకనుంచి 20 శాతం వసూలు చేస్తారు. మేక్‌ ఇన్‌ ఇండియాను భలోపేతంచేయడం, స్వదేశీ ఉత్పత్తుల అమ్మకాలను పెంచేందుకు మోదీ సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com