పాపం రాజమౌళిపై ఇలా అనటం సబబేనా
- December 15, 2017
ఆయన ప్రభుత్వం పిలిస్తే వెళ్లారు. డిజైన్లలో సహకారం కావాలంటే ఇచ్చారు. 'తన పని మానుకుని రెండుసార్లు లండన్ వెళ్లారు. మరికొన్నిసార్లు అమరావతి వెళ్లారు. అయినా సరే తాను సూచించిన డిజైన్లు ఏమీ ఆమోదం పొందలేదని ఆయనే స్వయంగా మీడియాకు తెలిపారు. తనది చాలా చిన్న సాయం' అంటూ హుందాగా వెళ్లిపోయారు. తన డిజైన్లు ఆమోదించకపోయినా..రాజమౌళి తన వంతు సాయం కింద పలు ప్రతిపాదనలు అందించారు. అందులో ఒకటి నూతన అసెంబ్లీలో తెలుగుతల్లి విగ్రహాం ఒకటి పెట్టి ..ఆ విగ్రహంపై అరసవిల్లి దేవాలయంపై సూర్యకిరణాలు పడినట్లు పడే వీడియో ఒకటి రూపొందించారు.కానీ తెలుగుతల్లిపై సూర్యకిరణాలు పడే వీడియో వ్యవహారంపై ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ పేషీ నుంచే దుష్ప్రచారం మొదలైంది. పేషీ నుంచి కొంత మంది అధికారులకు మెసెజ్ వెళ్లింది. ముందు తెలుగు తల్లి పాదాలను తాకే వెలుగులు..తర్వాత తల వరకూ వెళతాయి. అనంతరం అసెంబ్లీ నలువైపులా వెలుగులు వచ్చేలా డిజైన్ చేశారు. ఇది గురువారం నాడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఇందులో రాజమౌళి సృజనాత్మకత ఏమీలేదని..ఇది కూడా కాపీయే అంటూ పోస్టులు పెట్టారు.
అంతే కాదు..మీడియాకు సమాచారం అందించే ఓ గ్రూపులోనూ ఈ మెసెజ్ పెట్టారు. వెంటనే పొరపాటు చేశామని గ్రహించి ఈ మెసెజ్ ను వెంటనే డిలీట్ చేశారు. ఇది అధికార వర్గాల్లో కలకలం రేపుతోంది. ఓ వైపు సీఎం ఆఫీసులో పనిచేస్తూ..ఇలా ప్రభుత్వం ఆహ్వానించిన వ్యక్తిపై ఇలా దుష్ప్రచారం చేయాల్సిన అవసరం ఏముందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







