ఇప్పుడు ఎంసిఏతో డబుల్ హ్యాట్రిక్
- December 15, 2017
ఈ ఏడాదిలో వరుసగా ఐదు హిట్ సినిమాలు అందించిన నిర్మాత దిల్ రాజు మరో విజయం కోసం సన్నద్దమవుతున్నారు. నాని, సాయిపల్లవి జంటగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో నిర్మించిన ఎంసిఏ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. ఈ నెల 21న సినిమాను విడుదల చేస్తున్నారు.
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ మా సంస్థలో ఈ ఏడాది శతమానంభవతి, నేను లోకల్, దువ్వాడ జగన్నాథమ్, ఫిదా, రాజా ది గ్రేట్ చిత్రాలతో వరుసగా ఐదు సూపర్హిట్ సినిమాలు అందించాం. ఇప్పుడు ఎంసిఏతో డబుల్ హ్యాట్రిక్కు సిద్ధమయ్యాం. ఈ సినిమాతో డబుల్ హ్యాట్రిక్ సాధిస్తామనే నమ్మకం ఉంది. డైరెక్టర్ వేణు శ్రీరాం దర్శకత్వ ప్రతిభ అద్భుతంగా ఉంది. యూనిట్ అంతా సంతోషంగా ఉన్నాం. ముఖ్యంగా నాని, సాయిపల్లవిలకు ఈ సినిమాతో మరో హిట్ రావడం గ్యారంటీ.
అలాగే భూమిక ఇందులో వదిన పాత్రలో నటించారు. చాలా గ్యాప్ తర్వాత భూమిక తెలుగులో చేస్తున్న సినిమా ఇది. వదిన, మరిది మధ్య అనుబంధంపై కథనం ఉంటుంది. దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది. అంచనాలకు చేరుకునేలా వినోదాత్మక చిత్రమిది. సమీర్ రెడ్డి విజువల్స్ మరో ఆకర్షణ అని చెప్పారు. ఎంసిఏ ప్రీ రిలీజ్ వేడుకను శనివారం హన్మకొండలో నిర్వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఇంకా రాజీవ్ కనకాల, నరేష్, ఆమని నటిస్తున్నారు. మాటలు మామిడాల తిరుపతి, శ్రీకాంత్ విస్సా, నిర్మాణం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, లక్ష్మణ్.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







