ఇప్పుడు ఎంసిఏతో డబుల్ హ్యాట్రిక్
- December 15, 2017
ఈ ఏడాదిలో వరుసగా ఐదు హిట్ సినిమాలు అందించిన నిర్మాత దిల్ రాజు మరో విజయం కోసం సన్నద్దమవుతున్నారు. నాని, సాయిపల్లవి జంటగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో నిర్మించిన ఎంసిఏ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. ఈ నెల 21న సినిమాను విడుదల చేస్తున్నారు.
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ మా సంస్థలో ఈ ఏడాది శతమానంభవతి, నేను లోకల్, దువ్వాడ జగన్నాథమ్, ఫిదా, రాజా ది గ్రేట్ చిత్రాలతో వరుసగా ఐదు సూపర్హిట్ సినిమాలు అందించాం. ఇప్పుడు ఎంసిఏతో డబుల్ హ్యాట్రిక్కు సిద్ధమయ్యాం. ఈ సినిమాతో డబుల్ హ్యాట్రిక్ సాధిస్తామనే నమ్మకం ఉంది. డైరెక్టర్ వేణు శ్రీరాం దర్శకత్వ ప్రతిభ అద్భుతంగా ఉంది. యూనిట్ అంతా సంతోషంగా ఉన్నాం. ముఖ్యంగా నాని, సాయిపల్లవిలకు ఈ సినిమాతో మరో హిట్ రావడం గ్యారంటీ.
అలాగే భూమిక ఇందులో వదిన పాత్రలో నటించారు. చాలా గ్యాప్ తర్వాత భూమిక తెలుగులో చేస్తున్న సినిమా ఇది. వదిన, మరిది మధ్య అనుబంధంపై కథనం ఉంటుంది. దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది. అంచనాలకు చేరుకునేలా వినోదాత్మక చిత్రమిది. సమీర్ రెడ్డి విజువల్స్ మరో ఆకర్షణ అని చెప్పారు. ఎంసిఏ ప్రీ రిలీజ్ వేడుకను శనివారం హన్మకొండలో నిర్వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఇంకా రాజీవ్ కనకాల, నరేష్, ఆమని నటిస్తున్నారు. మాటలు మామిడాల తిరుపతి, శ్రీకాంత్ విస్సా, నిర్మాణం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, లక్ష్మణ్.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









