జనవరి 12న జై సింహ రిలీజ్
- December 15, 2017
బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం జైసింహా. నయనతార, నటాషా జోషీ, హరిప్రియ నాయికలుగా నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు కేఎస్ రవికుమార్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సి. కళ్యాణ్ నిర్మాత. ఇటీవల పాటల చిత్రీకరణతో జైసింహా షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వరలో ఆడియో కార్యక్రమాన్ని నిర్వహించున్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించారు. చిత్రీకరణ పూర్తయిన సందర్భంగా నిర్మాత సి. కళ్యాణ్ మాట్లాడుతూ.దుబాయ్లో రెండు పాటల చిత్రీకరణతో జైసింహా షూటింగ్ మొత్తం పూర్తయింది. బాలకృష్ణ, నయనతార, నటాషా జోషీలపై ఈ పాటలను రూపకల్పన చేశాం. జానీ, బృంద మాస్టర్ల నేతృత్వంలో యురోపియన్ డాన్సర్లతో తెరకెక్కించిన ఈ పాటలు జైసింహాలో ప్రత్యేక ఆకర్షణ అవుతాయి. చిరంతన్ భట్ మంచి సంగీతాన్ని అందిం చారు. డిసెంబర్ నెలాఖరకు పాటల విడుదల కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ముందు నిర్ణయించినట్లు జనవరి 12న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. అన్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







