జనవరి 12న జై సింహ రిలీజ్
- December 15, 2017
బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం జైసింహా. నయనతార, నటాషా జోషీ, హరిప్రియ నాయికలుగా నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు కేఎస్ రవికుమార్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సి. కళ్యాణ్ నిర్మాత. ఇటీవల పాటల చిత్రీకరణతో జైసింహా షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వరలో ఆడియో కార్యక్రమాన్ని నిర్వహించున్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించారు. చిత్రీకరణ పూర్తయిన సందర్భంగా నిర్మాత సి. కళ్యాణ్ మాట్లాడుతూ.దుబాయ్లో రెండు పాటల చిత్రీకరణతో జైసింహా షూటింగ్ మొత్తం పూర్తయింది. బాలకృష్ణ, నయనతార, నటాషా జోషీలపై ఈ పాటలను రూపకల్పన చేశాం. జానీ, బృంద మాస్టర్ల నేతృత్వంలో యురోపియన్ డాన్సర్లతో తెరకెక్కించిన ఈ పాటలు జైసింహాలో ప్రత్యేక ఆకర్షణ అవుతాయి. చిరంతన్ భట్ మంచి సంగీతాన్ని అందిం చారు. డిసెంబర్ నెలాఖరకు పాటల విడుదల కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ముందు నిర్ణయించినట్లు జనవరి 12న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. అన్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







