ఇకపై విశాఖ విమానాశ్రయంలోనూ విదేశీయులకు 'వీసా ఆన్ అరైవల్'
- December 15, 2017
అమరావతి: విదేశీయులు ఆంధ్రప్రదేశ్కు రావాలంటే ఇక మీదట వీసా ముందే తీసుకుని రావాల్సిన అవసరం ఉండదు. 'వీసా ఆన్ అరైవల్' కోసం ఆన్లైన్లో ముందుగా దరఖాస్తు చేసుకుని వచ్చేయవచ్చు. విశాఖపట్నం విమానాశ్రయంలో దిగాక అక్కడికక్కడే వీసా పొందవచ్చు. ఇందుకు వీలుకల్పిస్తూ... విశాఖపట్నంలో 'వీసా ఆన్ అరైవల్' జారీ చేసేందుకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ అనుమతిచ్చింది. ఈ మేరకు కేంద్రం నుంచి రాష్ట్రానికి సమాచారమందింది. ఇది వెంటనే అమల్లోకొస్తుందని, సంబంధిత అధికారులు తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. కేంద్రం తాజా నిర్ణయంతో రాష్ట్రానికి విదేశీ పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఇకమీదట 147 దేశాల నుంచి విదేశీ పర్యాటకులు వీసా లేకుండానే నేరుగా విశాఖకు వచ్చి, వీసా తీసుకుని రాష్ట్రమంతా పర్యటించవచ్చని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిల తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ సౌకర్యం 17 విమానాశ్రయాల్లోనే ఉండగా ఇప్పుడు విశాఖను అందులో చేర్చినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు చెప్పారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల