జనవరిలో కొత్త వంతెన ప్రారంభం: కరామాలో తగ్గనున్న ట్రాఫిక్ ఇబ్బందులు
- December 16, 2017
దుబాయ్లో 'బాటిల్ నెక్స్' ట్రాఫిక్ సమస్యలకు కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కరామా వద్ద షేక్ ఖలీఫా బిన్ జాయెద్ స్ట్రీట్లో నిర్మితమవుతోంది ఓ నూతన వంతెన. ఇది జనవరిలో అందుబాటులోకి రానున్నట్లు రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ) బోర్డ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఛైర్మన్, డైరెక్టర్ జనరల్ మట్టర్ అల్ తాయెర్ చెప్పారు. 2018 రెండో క్వార్టర్లో అల్ గర్హౌద్ మరియు మినా రషీద్ని కలిపే టన్నెల్ని ప్రారంభించనున్నట్లు వివరించారు అల్ తాయెర్. ఈ పనులు 70 శాతం ఇప్పటికే పూర్తయ్యాయని అన్నారాయన. ప్రాజెక్ట్ని పర్యవేక్షించిన సమయంలో అల్ తాయెర్ ఈ విషయాల్ని వెల్లడించారు. ట్రాఫిక్ ఇబ్బందుల్ని తగ్గించి, వాహనాల మూమెంట్ని మరింత స్మూత్గా మార్చేందుకు ఎప్పటికప్పుడు నిపుణుల సలహాలు, సూచనలతో మాస్టర్ ప్లాన్స్లో మార్పులు చేస్తున్నామని అల్ తాయెర్ వివరించారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







