20 వృత్తులలో ఉద్యోగ భర్తీకి విద్యా మంత్రిత్వ శాఖ నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణత కావాల్సిందే
- December 16, 2017
కువైట్: ప్రభుత్వం నిర్వహించే పరీక్షలో పాస్ కాబడితేనే ఇకపై కువైట్ లో కొన్ని ఉద్యోగాలు దక్కనున్నాయి. 20 వృత్తులలో అభ్యర్థులను వివిధ ఉద్యోగాలలో భర్తీ చేసుకొనేందుకు నియామక నిబంధనలను మానవ వనరుల పబ్లిక్ అథారిటీ ఏర్పాటుచేసిందని విశ్వసనీయ సమాచారం ద్వారా వెల్లడికాబడింది.. విద్యా మంత్రిత్వ శాఖతో ఒక ఒప్పందం ప్రకారం ఒక పరీక్షలో వారు ఉత్తీర్ణులు కావడం ద్వారా ఉద్యోగులను నియమించుకొనున్నారు.గత ఆరు నెలల్లో 260 మంది ప్రత్యేక అవసరాలు గల ఉపాధ్యాయులు, 110 మంది అసిస్టెంట్ ఉపాధ్యాయులు, ప్రత్యేక అవసరాలు గల 15 మంది సామాజిక కార్యకర్తలు, 20 మంది మనోరోగ వైద్యులతో కలిపి మొత్తం 200 మందికి ఉద్యోగావకాశాలు లభించాయని అధికారులు పేర్కొన్నారు .మెకానిక్స్, ఆటోమొబైల్ ఇంజనీర్స్, పెయింటర్లు మరియు వంటవాళ్లు తదితరుల నుండి 30 అప్లికేషన్లు రాగా వాటిలో 15 దరఖాస్తులు ప్రస్తుత నియమ నిబంధనలకు సరిపోనున్నాయి.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







