20 వృత్తులలో ఉద్యోగ భర్తీకి విద్యా మంత్రిత్వ శాఖ నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణత కావాల్సిందే

- December 16, 2017 , by Maagulf
20 వృత్తులలో ఉద్యోగ భర్తీకి  విద్యా మంత్రిత్వ శాఖ నిర్వహించే  పరీక్షలో ఉత్తీర్ణత కావాల్సిందే

కువైట్: ప్రభుత్వం నిర్వహించే పరీక్షలో పాస్ కాబడితేనే ఇకపై కువైట్ లో కొన్ని ఉద్యోగాలు దక్కనున్నాయి. 20 వృత్తులలో అభ్యర్థులను వివిధ ఉద్యోగాలలో భర్తీ చేసుకొనేందుకు నియామక నిబంధనలను మానవ వనరుల పబ్లిక్ అథారిటీ  ఏర్పాటుచేసిందని విశ్వసనీయ సమాచారం ద్వారా వెల్లడికాబడింది.. విద్యా  మంత్రిత్వ శాఖతో ఒక ఒప్పందం ప్రకారం ఒక పరీక్షలో వారు ఉత్తీర్ణులు కావడం ద్వారా ఉద్యోగులను  నియమించుకొనున్నారు.గత ఆరు నెలల్లో 260 మంది ప్రత్యేక అవసరాలు గల ఉపాధ్యాయులు, 110 మంది అసిస్టెంట్ ఉపాధ్యాయులు, ప్రత్యేక అవసరాలు గల 15 మంది సామాజిక కార్యకర్తలు, 20 మంది మనోరోగ వైద్యులతో కలిపి మొత్తం 200 మందికి ఉద్యోగావకాశాలు లభించాయని అధికారులు పేర్కొన్నారు .మెకానిక్స్, ఆటోమొబైల్ ఇంజనీర్స్, పెయింటర్లు  మరియు వంటవాళ్లు తదితరుల నుండి 30 అప్లికేషన్లు రాగా వాటిలో 15 దరఖాస్తులు ప్రస్తుత నియమ నిబంధనలకు సరిపోనున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com