20 వృత్తులలో ఉద్యోగ భర్తీకి విద్యా మంత్రిత్వ శాఖ నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణత కావాల్సిందే
- December 16, 2017
కువైట్: ప్రభుత్వం నిర్వహించే పరీక్షలో పాస్ కాబడితేనే ఇకపై కువైట్ లో కొన్ని ఉద్యోగాలు దక్కనున్నాయి. 20 వృత్తులలో అభ్యర్థులను వివిధ ఉద్యోగాలలో భర్తీ చేసుకొనేందుకు నియామక నిబంధనలను మానవ వనరుల పబ్లిక్ అథారిటీ ఏర్పాటుచేసిందని విశ్వసనీయ సమాచారం ద్వారా వెల్లడికాబడింది.. విద్యా మంత్రిత్వ శాఖతో ఒక ఒప్పందం ప్రకారం ఒక పరీక్షలో వారు ఉత్తీర్ణులు కావడం ద్వారా ఉద్యోగులను నియమించుకొనున్నారు.గత ఆరు నెలల్లో 260 మంది ప్రత్యేక అవసరాలు గల ఉపాధ్యాయులు, 110 మంది అసిస్టెంట్ ఉపాధ్యాయులు, ప్రత్యేక అవసరాలు గల 15 మంది సామాజిక కార్యకర్తలు, 20 మంది మనోరోగ వైద్యులతో కలిపి మొత్తం 200 మందికి ఉద్యోగావకాశాలు లభించాయని అధికారులు పేర్కొన్నారు .మెకానిక్స్, ఆటోమొబైల్ ఇంజనీర్స్, పెయింటర్లు మరియు వంటవాళ్లు తదితరుల నుండి 30 అప్లికేషన్లు రాగా వాటిలో 15 దరఖాస్తులు ప్రస్తుత నియమ నిబంధనలకు సరిపోనున్నాయి.
తాజా వార్తలు
- బ్రేకింగ్: సంక్షోభంలోనూ స్థిరంగా బంగారం..ఇన్వెస్టర్లను ఊరిస్తున్న మార్కెట్!
- చిన్ననోట్ల కోసం ప్రత్యేక ఏటీఎంలు, కేంద్రం కీలక నిర్ణయం
- ఇరాన్ తో యుద్ధం..అమెరికా సంచలన ప్రకటన..
- హైదరాబాద్లో అగ్నిప్రమాదం, చార్మినార్ వద్ద ముగ్గురికి గాయాలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!









