ఎమిరేట్స్ ఎన్విరాన్మెంటల్ గ్రూప్ ఆధ్వర్యంలో 'క్లీన్ అప్ యూఏఈ'
- December 16, 2017యూఏఈ : పాఠశాలలు, కళాశాలలు మరియు ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీల నుండి వేలమంది ప్రజలు శనివారం ఉదయం ఒక సామూహిక స్వచ్ఛంద సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. " యూఏఈ ను శుభ్రం చేద్దాం " పేరిట వ్యర్థాలను తొలగించడమే లక్ష్యంగా ఈ మహోన్నత సేవా కార్యక్రమాన్ని ఏమిరాటిస్ పర్యావరణ సమూహం ( ఏమిరాటిస్ ఎన్విరాన్మెంట్ గ్రూప్ ) ద్వారా నిర్వహించబడింది పాఠశాలలు, కళాశాలలు మరియు ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీల నుండి వేలమంది ప్రజలతో పాటు దేవా , ఎం.సి. డోనాల్డ్, అల్ ఘుర్ర్ర్ మరియు మిలీనియం హోటల్ దుబాయ్ మొదలైన సంస్థలు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే , పర్యావరణానికి హాని చేసే ప్లాస్టిక్ సంచులు మరియు సీసాలు మొదలైన వ్యర్ధాలను తొలగించి శుభ్రమైన ప్రాంతంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా ఎడారి దుబాయ్ అలీన్ రహదారి వద్ద ఈ కార్యక్రమం జరిగింది. పరిశుభ్రమైన యూఏఈ కోసం ఉత్సాహంగా జరిగిన ఈ సామాజిక స్వచ్చంద కార్యక్రమంలో ఎడారి నుండి ఎన్నో సేకరించిన వ్యర్థాలు ఉన్నాయి. ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్న స్వచ్ఛంద సేవకులకు పండ్లు నీరు మరియు అల్పాహారం నిర్వాహుకులు పంపిణీ చేశారు.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?