దుబాయ్ లో పర్మిషన్ రానందున 'సాహో' షెడ్యూల్లో మార్పు

- December 17, 2017 , by Maagulf
దుబాయ్ లో పర్మిషన్ రానందున 'సాహో' షెడ్యూల్లో మార్పు

ప్రభాస్ , శ్రద్ద కపూర్ జంటగా సుజిత్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం సాహో. తెలుగు , తమిళ్ , హిందీ భాషల్లో భారీ ఎత్తున తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ కొద్దీ రోజులుగా ఆగిపోయింది. హైదరాబాద్ లో మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ , నెక్స్ట్ షెడ్యూల్ దుబాయ్ లో ప్లాన్ చేసారు.

బుర్జ్ ఖలీఫా టవర్, రస్-అల్-ఖమా వరల్డ్ ట్రేడ్ సెంటర్, అబుదాబిలోని ఇతిహాద్ టవర్ తో పాటు దుబాయ్ శివార్లలోని భారీ ఎడారి, కొండల మధ్య ఛేజింగ్ సన్నివేశాలు వంటివి తెరకెక్కించాలని అనుకున్నారు. కానీ ప్రస్తుతం అక్కడ షూటింగ్ కు ఇంకా అనుమతి రాలేదట. దీంతో ఇంకా వెయిట్ చేస్తే నటి నటుల కాల్ షీట్స్ వెస్ట్ అవుతాయని భావించిన చిత్ర యూనిట్ , హైదరాబాద్ లో చిన్నపాటి షూటింగ్ మొదలు పెట్టాలని అనుకుంటున్నారట. ఈ షెడ్యూల్ పూర్తికాగానే సుమారు రెండున్న నెలల భారీ షెడ్యూల్ కోసం టీమ్ దుబాయ్ వెళుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com