దుబాయ్ లో పర్మిషన్ రానందున 'సాహో' షెడ్యూల్లో మార్పు
- December 17, 2017
ప్రభాస్ , శ్రద్ద కపూర్ జంటగా సుజిత్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం సాహో. తెలుగు , తమిళ్ , హిందీ భాషల్లో భారీ ఎత్తున తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ కొద్దీ రోజులుగా ఆగిపోయింది. హైదరాబాద్ లో మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ , నెక్స్ట్ షెడ్యూల్ దుబాయ్ లో ప్లాన్ చేసారు.
బుర్జ్ ఖలీఫా టవర్, రస్-అల్-ఖమా వరల్డ్ ట్రేడ్ సెంటర్, అబుదాబిలోని ఇతిహాద్ టవర్ తో పాటు దుబాయ్ శివార్లలోని భారీ ఎడారి, కొండల మధ్య ఛేజింగ్ సన్నివేశాలు వంటివి తెరకెక్కించాలని అనుకున్నారు. కానీ ప్రస్తుతం అక్కడ షూటింగ్ కు ఇంకా అనుమతి రాలేదట. దీంతో ఇంకా వెయిట్ చేస్తే నటి నటుల కాల్ షీట్స్ వెస్ట్ అవుతాయని భావించిన చిత్ర యూనిట్ , హైదరాబాద్ లో చిన్నపాటి షూటింగ్ మొదలు పెట్టాలని అనుకుంటున్నారట. ఈ షెడ్యూల్ పూర్తికాగానే సుమారు రెండున్న నెలల భారీ షెడ్యూల్ కోసం టీమ్ దుబాయ్ వెళుతుంది.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







