కన్నీటి పర్యంతమైన పీవీ సిం
- December 17, 2017భారత బ్యాడ్మింటన్ క్వీన్ పీవీ సింధు కల మరోసారి చెదిరింది. చరిత్రకు అడుగుదూరంలో నిలిచిపోయింది. వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్ మ్యాచ్లో పోరాడి ఓడింది.. రజత పతకంతో సరిపెట్టుకుంది. మహిళల సింగిల్స్ ఫైనల్ పోరులో సింధు 21-15, 12-21, 19-21తో జపాన్ ప్లేయర్ యమగుచి చేతిలో ఓటమిపాలైంది. ఫైనల్ మ్యాచ్లో సింధుకి ఓటమి ఇది తొలిసారి కాదు. గత ఏడాది రియో ఒలింపిక్స్ ఫైనల్లో పరాజయం పాలైన సింధు, ఈ ఏడాదిఆగస్టులో జరిగిన వరల్డ్ చాంపియన్ షిప్ టైటిల్ పోరులో ఓడిపోయింది. తాజాగా సూపర్ సిరీస్ ఫైనల్లో మరోసారి అదే ఫలితం ఎదురైంది. దాదాపు గంటన్నరపాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్లో మొదట్లో సింధు ఆధిక్యం కనబరిచినా, చివరి వరకు అదే జోరును కొనసాగించలేకపోయింది. రెండో సెట్ను యమగుచి గెలుచుకోగా.. కీలకమైన మూడో సెట్ హోరాహోరీగా సాగింది.. అయితే ఊహించని రీతిలో పుంజుకున్న యమగుచి టైటిల్ను తన్నుకుపోయింది. ఆఖరి నిమిషంలో పరాజయం పాలవడంతో సింధు కన్నీటి పర్యంతమైంది.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్