కన్నీటి పర్యంతమైన పీవీ సిం
- December 17, 2017
భారత బ్యాడ్మింటన్ క్వీన్ పీవీ సింధు కల మరోసారి చెదిరింది. చరిత్రకు అడుగుదూరంలో నిలిచిపోయింది. వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్ మ్యాచ్లో పోరాడి ఓడింది.. రజత పతకంతో సరిపెట్టుకుంది. మహిళల సింగిల్స్ ఫైనల్ పోరులో సింధు 21-15, 12-21, 19-21తో జపాన్ ప్లేయర్ యమగుచి చేతిలో ఓటమిపాలైంది. ఫైనల్ మ్యాచ్లో సింధుకి ఓటమి ఇది తొలిసారి కాదు. గత ఏడాది రియో ఒలింపిక్స్ ఫైనల్లో పరాజయం పాలైన సింధు, ఈ ఏడాదిఆగస్టులో జరిగిన వరల్డ్ చాంపియన్ షిప్ టైటిల్ పోరులో ఓడిపోయింది. తాజాగా సూపర్ సిరీస్ ఫైనల్లో మరోసారి అదే ఫలితం ఎదురైంది. దాదాపు గంటన్నరపాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్లో మొదట్లో సింధు ఆధిక్యం కనబరిచినా, చివరి వరకు అదే జోరును కొనసాగించలేకపోయింది. రెండో సెట్ను యమగుచి గెలుచుకోగా.. కీలకమైన మూడో సెట్ హోరాహోరీగా సాగింది.. అయితే ఊహించని రీతిలో పుంజుకున్న యమగుచి టైటిల్ను తన్నుకుపోయింది. ఆఖరి నిమిషంలో పరాజయం పాలవడంతో సింధు కన్నీటి పర్యంతమైంది.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!