కన్నీటి పర్యంతమైన పీవీ సిం
- December 17, 2017భారత బ్యాడ్మింటన్ క్వీన్ పీవీ సింధు కల మరోసారి చెదిరింది. చరిత్రకు అడుగుదూరంలో నిలిచిపోయింది. వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్ మ్యాచ్లో పోరాడి ఓడింది.. రజత పతకంతో సరిపెట్టుకుంది. మహిళల సింగిల్స్ ఫైనల్ పోరులో సింధు 21-15, 12-21, 19-21తో జపాన్ ప్లేయర్ యమగుచి చేతిలో ఓటమిపాలైంది. ఫైనల్ మ్యాచ్లో సింధుకి ఓటమి ఇది తొలిసారి కాదు. గత ఏడాది రియో ఒలింపిక్స్ ఫైనల్లో పరాజయం పాలైన సింధు, ఈ ఏడాదిఆగస్టులో జరిగిన వరల్డ్ చాంపియన్ షిప్ టైటిల్ పోరులో ఓడిపోయింది. తాజాగా సూపర్ సిరీస్ ఫైనల్లో మరోసారి అదే ఫలితం ఎదురైంది. దాదాపు గంటన్నరపాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్లో మొదట్లో సింధు ఆధిక్యం కనబరిచినా, చివరి వరకు అదే జోరును కొనసాగించలేకపోయింది. రెండో సెట్ను యమగుచి గెలుచుకోగా.. కీలకమైన మూడో సెట్ హోరాహోరీగా సాగింది.. అయితే ఊహించని రీతిలో పుంజుకున్న యమగుచి టైటిల్ను తన్నుకుపోయింది. ఆఖరి నిమిషంలో పరాజయం పాలవడంతో సింధు కన్నీటి పర్యంతమైంది.
తాజా వార్తలు
- కోవిడ్ సర్టిఫికేట్ నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగింపు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం