అబుధాబి, షేక్ జాయెద్ గ్రాండ్ మసీదులో యు.ఎ.ఈ. అమరవీరుల స్మారక చిహ్నం

- November 17, 2015 , by Maagulf
అబుధాబి, షేక్ జాయెద్ గ్రాండ్  మసీదులో యు.ఎ.ఈ. అమరవీరుల స్మారక చిహ్నం

దేశ అమరవీరుల కోసం స్మృతి చిహ్నాన్ని నిర్మించాలనే అబుధాబి యువరాజు, యు.ఎ.ఈ.  సాయుధ దళాల డిప్యుటీ సుప్రీం కమాండర్ హిజ్ హైనెస్ షేక్ మొహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ వారి ఆదేశానుసారం, యువరాజు వారి ఆస్థానం యొక్క అమరవీరులు మరియు వారి కుటుంబ వ్యవహారాల కార్యాలయం వారు - షేక్ జాయెద్ గ్రాండ్  మసీదు వద్ద యు.ఎ.ఈ. అమరవీరుల స్మారక చిహ్నం నిర్మించనున్నామని ప్రకటించారు. అబుధాబి లోకి ప్రవేశిస్తున్న లేదా నిష్క్రమిస్తున్న, లేదా ఏ దిశలోనైనా ఈ స్మారక చిహ్నం గోచర మయ్యేలా ఈ స్థలాన్ని ఎంపిక చేసామని వారు వివరించారు. ఈ వీరుల కీర్తిని  శాశ్వతం చేయాలనే అధ్యక్షులు - హిజ్ హైనేస్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల నహ్యాన్ వారి సంకల్పం వలెనే ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చిందని పలువురు కొనియాడారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com