ముంబయిలో ఘోరం..12 మంది సజీవ దహనం
- December 18, 2017
ముంబయిలో సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఓ మిఠాయి దుకాణంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 12 మంది సజీవ దహనమయ్యారు. మరో తొమ్మిది మంది గాయాలతో బయటపడ్డారు. విద్యుదాఘాతం కారణంగా స్విచ్బోర్డు నుంచి ప్రారంభమైన మంటలు ఎల్పీజీ సిలిండర్ను చేరుకోవడంతో అది పేలిపోయి ఉండవచ్చని ప్రాథమిక ఆధారాలను బట్టి పోలీసులు అనుమానిస్తున్నారు. అది పేలిన ధాటికి దుకాణం భవనం కుప్పకూలింది. ఈలోపే అగ్నికీలలకు భయపడి తొమ్మిది మంది పరుగులు పెట్టి తప్పించుకోగలిగారు. అంధేరి సాకినాకాలోని ఘాట్కోపర్ ఖైరానీ రోడ్డులోని ఒక భవనంలోని పైఅంతస్తులో భానుమిఠాయి దుకాణం ఉంది. సోమవారం తెల్లవారుజామున ఆ భవనంలో అకస్మాతుగా అగ్గి రాజుకుంది. గ్రౌండ్ఫ్లోర్లో నిద్రిస్తున్న 12 మంది సిబ్బంది అప్రమత్తమై ప్రాణాలు కాపాడుకునేందకు పై అంతస్తుకు పరుగులు తీశారు. అప్పటికే పై అంతస్తులో మంటలు వ్యాపించి ఉన్నాయి.
బయటపడేందుకు మార్గం లేక 12మంది సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పేశారు. కార్మికుల మృతదేహాలను ఘాట్కోపర్ రాజవాడి ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియలేదని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సాకినాక పోలీసు ఠాణా సీఐ అవినాశ్ ధర్మాధికారి తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







