ముంబయిలో ఘోరం..12 మంది సజీవ దహనం
- December 18, 2017ముంబయిలో సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఓ మిఠాయి దుకాణంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 12 మంది సజీవ దహనమయ్యారు. మరో తొమ్మిది మంది గాయాలతో బయటపడ్డారు. విద్యుదాఘాతం కారణంగా స్విచ్బోర్డు నుంచి ప్రారంభమైన మంటలు ఎల్పీజీ సిలిండర్ను చేరుకోవడంతో అది పేలిపోయి ఉండవచ్చని ప్రాథమిక ఆధారాలను బట్టి పోలీసులు అనుమానిస్తున్నారు. అది పేలిన ధాటికి దుకాణం భవనం కుప్పకూలింది. ఈలోపే అగ్నికీలలకు భయపడి తొమ్మిది మంది పరుగులు పెట్టి తప్పించుకోగలిగారు. అంధేరి సాకినాకాలోని ఘాట్కోపర్ ఖైరానీ రోడ్డులోని ఒక భవనంలోని పైఅంతస్తులో భానుమిఠాయి దుకాణం ఉంది. సోమవారం తెల్లవారుజామున ఆ భవనంలో అకస్మాతుగా అగ్గి రాజుకుంది. గ్రౌండ్ఫ్లోర్లో నిద్రిస్తున్న 12 మంది సిబ్బంది అప్రమత్తమై ప్రాణాలు కాపాడుకునేందకు పై అంతస్తుకు పరుగులు తీశారు. అప్పటికే పై అంతస్తులో మంటలు వ్యాపించి ఉన్నాయి.
బయటపడేందుకు మార్గం లేక 12మంది సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పేశారు. కార్మికుల మృతదేహాలను ఘాట్కోపర్ రాజవాడి ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియలేదని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సాకినాక పోలీసు ఠాణా సీఐ అవినాశ్ ధర్మాధికారి తెలిపారు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్