ముంబయిలో ఘోరం..12 మంది సజీవ దహనం
- December 18, 2017
ముంబయిలో సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఓ మిఠాయి దుకాణంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 12 మంది సజీవ దహనమయ్యారు. మరో తొమ్మిది మంది గాయాలతో బయటపడ్డారు. విద్యుదాఘాతం కారణంగా స్విచ్బోర్డు నుంచి ప్రారంభమైన మంటలు ఎల్పీజీ సిలిండర్ను చేరుకోవడంతో అది పేలిపోయి ఉండవచ్చని ప్రాథమిక ఆధారాలను బట్టి పోలీసులు అనుమానిస్తున్నారు. అది పేలిన ధాటికి దుకాణం భవనం కుప్పకూలింది. ఈలోపే అగ్నికీలలకు భయపడి తొమ్మిది మంది పరుగులు పెట్టి తప్పించుకోగలిగారు. అంధేరి సాకినాకాలోని ఘాట్కోపర్ ఖైరానీ రోడ్డులోని ఒక భవనంలోని పైఅంతస్తులో భానుమిఠాయి దుకాణం ఉంది. సోమవారం తెల్లవారుజామున ఆ భవనంలో అకస్మాతుగా అగ్గి రాజుకుంది. గ్రౌండ్ఫ్లోర్లో నిద్రిస్తున్న 12 మంది సిబ్బంది అప్రమత్తమై ప్రాణాలు కాపాడుకునేందకు పై అంతస్తుకు పరుగులు తీశారు. అప్పటికే పై అంతస్తులో మంటలు వ్యాపించి ఉన్నాయి.
బయటపడేందుకు మార్గం లేక 12మంది సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పేశారు. కార్మికుల మృతదేహాలను ఘాట్కోపర్ రాజవాడి ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియలేదని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సాకినాక పోలీసు ఠాణా సీఐ అవినాశ్ ధర్మాధికారి తెలిపారు.
తాజా వార్తలు
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు