ముంబయిలో ఘోరం..12 మంది సజీవ దహనం
- December 18, 2017
ముంబయిలో సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఓ మిఠాయి దుకాణంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 12 మంది సజీవ దహనమయ్యారు. మరో తొమ్మిది మంది గాయాలతో బయటపడ్డారు. విద్యుదాఘాతం కారణంగా స్విచ్బోర్డు నుంచి ప్రారంభమైన మంటలు ఎల్పీజీ సిలిండర్ను చేరుకోవడంతో అది పేలిపోయి ఉండవచ్చని ప్రాథమిక ఆధారాలను బట్టి పోలీసులు అనుమానిస్తున్నారు. అది పేలిన ధాటికి దుకాణం భవనం కుప్పకూలింది. ఈలోపే అగ్నికీలలకు భయపడి తొమ్మిది మంది పరుగులు పెట్టి తప్పించుకోగలిగారు. అంధేరి సాకినాకాలోని ఘాట్కోపర్ ఖైరానీ రోడ్డులోని ఒక భవనంలోని పైఅంతస్తులో భానుమిఠాయి దుకాణం ఉంది. సోమవారం తెల్లవారుజామున ఆ భవనంలో అకస్మాతుగా అగ్గి రాజుకుంది. గ్రౌండ్ఫ్లోర్లో నిద్రిస్తున్న 12 మంది సిబ్బంది అప్రమత్తమై ప్రాణాలు కాపాడుకునేందకు పై అంతస్తుకు పరుగులు తీశారు. అప్పటికే పై అంతస్తులో మంటలు వ్యాపించి ఉన్నాయి.
బయటపడేందుకు మార్గం లేక 12మంది సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పేశారు. కార్మికుల మృతదేహాలను ఘాట్కోపర్ రాజవాడి ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియలేదని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సాకినాక పోలీసు ఠాణా సీఐ అవినాశ్ ధర్మాధికారి తెలిపారు.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









