వాషింగ్టన్‌: పట్టాలు తప్పిన రైలు.. ముగ్గురు మృతి!

- December 18, 2017 , by Maagulf
వాషింగ్టన్‌: పట్టాలు తప్పిన రైలు.. ముగ్గురు మృతి!

సియాటిల్‌: అమెరికాలోని వాషింగ్టన్‌ రాష్ట్రం టకోమా నగరం సమీపంలో సోమవారం రాత్రి(అమెరికా కాలమానం) రైలు పట్టాలు తప్పడంతో దాదాపు ముగ్గురు మరణించినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సియాటల్‌ నుంచి పోర్ట్‌లాండ్‌కు వెళ్తుండగా ఈ రైలు పట్టాలు తప్పింది. ప్రమాద సమయంలో రైలులో 78 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బంది ఉన్నారు. ఒక బోగీ హైవేపై బోల్తా పడిందని స్థానిక పోలీసు అధికారి ఒకరు తెలిపారు. గాయపడ్డ పలువురిని స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com