టెహ్రాన్కి విమాన సేవల్ని నిలిపివేయనున్న ఎతిహాద్
- December 19, 2017యు.ఏ.ఈ:ఎతిహాద్ ఎయిర్ వేస్ , టెహ్రాన్కి విమానాల్ని నిలిపివేయనుంది. ఎతిహాద్ తీసుకున్న ఈ నిర్ణయంతో 2018 జనవరి 24 నుంచి టెహ్రాన్కి విమాన సేవలు నిలిచిపోతాయి. ఇరాన్ రాజధానికి ఎతిహాద్ ప్రస్తుతం నడుపుతున్న ఐదు వీక్లీ విమానాల్ని డిసెంబర్ 25 నుంచి జనవరి 23 వరకు వారానికి రెండు మాత్రమే నడపాలని, జనవరి 24 తర్వాత పూర్తిగా సేవల్ని నిలిపివేయాలని నిర్ణయించినట్లు ఎతిహాద్ ఎయిర్లైన్స్ అధికార ప్రతినిథి వెల్లడించారు. ఈ రూట్ ఎందుకు సస్పెండ్ చేస్తున్నారన్న విషయమ్మీద మాత్రం అధికార ప్రతినిథి స్పందించలేదు. స్ట్రేటజీ రివ్యూలో భాగంగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం శాన్ఫ్రాన్సిస్కో, డల్లాస్ - ఫోర్ట్కి కూడా విమాన సర్వీసుల్ని తగ్గించనుంది. ఇప్పటికే బుకింగ్ చేసుకున్న వినియోగదారులకు కలిగే అసౌకర్యం పట్ల చింతిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. ఆయా రూట్లలో ప్రయాణాల్ని రీ-బుక్ చేసుకోవడం లేదా చెల్లించిన మొత్తాన్ని తిరిగి తీసుకునే అవకాశం కల్పిస్తోంది ఎతిహాద్ ఎయిర్లైన్స్. జనవరి 24 తర్వాత ప్రయాణాలకు మాత్రం పూర్తిగా రిఫండ్ ఇవ్వనున్నారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు