పాక్ జైళ్లలో మగ్గుతున్న 500 పైగా భారతీయలు
- December 19, 2017
పాకిస్థాన్ జైళ్లలో దాదాపు 500 మందికి పైగా భారతీయ ఖైదీలు ఉన్నట్లు తాజా నివేదిక ద్వారా వెల్లడైంది. పాక్లోని వివిధ జైళ్లలో ఎంతమంది విదేశీ ఖైదీలు ఉన్నారనే దానికి సంబంధించిన నివేదికను ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. మొత్తం 996 మంది విదేశీయులు పాక్ జైళ్లలో మగ్గుతుండగా.. వారిలో 527 మంది భారతీయులు ఉన్నారు. ఉగ్రవాదం, హత్య, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, అక్రమంగా ఆ దేశంలోకి చొరబడటం వంటి నేరాలు చేసిన వాళ్లే ఎక్కువ మంది ఉన్నట్లు ఆ దేశ అధికారులు తెలిపారు. పాక్ జైళ్లలో ఉన్న భారతీయుల్లో ఎక్కువ మంది మత్స్యకారులు ఉన్నారు. పాక్ జలాల్లోకి అక్రమంగా ప్రవేశించి చేపల వేట చేస్తున్న జాలర్లను ఎక్కువగా పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు. గత నెల 55 మంది భారతీయ జాలర్లను పాక్ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మిగతా విదేశీ ఖైదీల్లో సౌదీ, చైనాకు చెందిన వాళ్లు ఉన్నారు. పాక్ దేశానికి చెందిన దాదాపు 9,476మంది 100 దేశాల్లోని జైళ్లలో ఖైదీలుగా ఉన్నట్లు విదేశాంగశాఖ అధికారి లాహోర్ న్యాయస్థానానికి తెలియజేశారు.
తాజా వార్తలు
- ఆగస్టు 1 నుంచి మారనున్న స్పీడ్ పోస్ట్ ఛార్జీలు..పూర్తి వివరాలు ఇవే!
- తైవాన్ పారిశ్రామిక దిగ్గజాలతో సీఎం చంద్రబాబు భేటీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం
- బహ్రెయిన్లో డొమెస్టిక్ వర్కర్ కు 5 ఏళ్ల జైలు, భారీ జరిమానా..!!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ తో స్పెయిన్ ప్రధాని చర్చలు..!!
- ఖతార్లో పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యానికి ప్రత్యేక క్లినిక్..!!
- ధోఫార్లోని వాడి జర్జీజ్లో వ్యక్తిని రక్షించిన సివిల్ డిఫెన్స్..!!
- కువైట్లో కొత్త ఫ్రీలాన్స్ వ్యాపార లైసెన్సుల జారీ నిలిపివేత..!!
- యూఏఈలో నెగెటివ్ రివ్యూ పోస్టులపై నిపుణుల వార్నింగ్..!!
- NEET పేపర్ లీక్ కేసులో 13 మందిపై సీబీఐ అభియోగాలు
- తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు







