పవన్ అభిమానులకు డబుల్ ధమాకా!! మరి అదేంటంటే...
- December 20, 2017
పవన్ కళ్యాణ్ 25వ చిత్రం అజ్ఞాతవాసి చిత్రంపై తెలుగు రాష్ట్రాలలోనే కాదు దేశ విదేశాలలోను ఆసక్తి నెలకొంది. ఇటీవల విడుదలైన చిత్ర టీజర్ సంచలనం సృష్టించింది. సౌత్లో ఎక్కువ వ్యూస్ సాధించిన రెండో టీజర్గా రికార్డు నెలకొల్పింది. ఇక నిన్న జరిగిన ఆడియో వేడుకలో ట్రైలర్ విడుదల చేస్తారని భావించగా, కేవలం పాటలని మాత్రమే విడుదల చేసిన చిత్ర యూనిట్ ట్రైలర్ని రిలీజ్ చేయలేదు. తాజాగా ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 26న చిత్ర థియేట్రికల్ ట్రైలర్ని విడుదల చేయాలని భావిస్తుంది చిత్ర బృందం. ఇక ఈ సినిమాలోను పవన్ కళ్యాణ్ ఒక పాట పాడాడని తెలుస్తుండగా, డిసెంబర్ 31న ఆ సాంగ్ని విడుదల చేయనున్నారు. అంటే వచ్చే వారంలో పవన్ అభిమానులకి డబుల్ బోనాంజా దొరకనుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బొమన్ ఇరానీ, ఖుష్బూ, ఆది పినిశెట్టి, రావు రమేశ్, మురళీ శర్మ ముఖ్య పాత్రలు పోషించగా కీర్తి సురేష్, అను ఎమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బేనర్పై రాధాకృష్ణ నిర్మించిన ఈ చిత్రం జనవరి 10న విడుదల కానున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







