పవన్ అభిమానులకు డబుల్ ధమాకా!! మరి అదేంటంటే...
- December 20, 2017
పవన్ కళ్యాణ్ 25వ చిత్రం అజ్ఞాతవాసి చిత్రంపై తెలుగు రాష్ట్రాలలోనే కాదు దేశ విదేశాలలోను ఆసక్తి నెలకొంది. ఇటీవల విడుదలైన చిత్ర టీజర్ సంచలనం సృష్టించింది. సౌత్లో ఎక్కువ వ్యూస్ సాధించిన రెండో టీజర్గా రికార్డు నెలకొల్పింది. ఇక నిన్న జరిగిన ఆడియో వేడుకలో ట్రైలర్ విడుదల చేస్తారని భావించగా, కేవలం పాటలని మాత్రమే విడుదల చేసిన చిత్ర యూనిట్ ట్రైలర్ని రిలీజ్ చేయలేదు. తాజాగా ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 26న చిత్ర థియేట్రికల్ ట్రైలర్ని విడుదల చేయాలని భావిస్తుంది చిత్ర బృందం. ఇక ఈ సినిమాలోను పవన్ కళ్యాణ్ ఒక పాట పాడాడని తెలుస్తుండగా, డిసెంబర్ 31న ఆ సాంగ్ని విడుదల చేయనున్నారు. అంటే వచ్చే వారంలో పవన్ అభిమానులకి డబుల్ బోనాంజా దొరకనుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బొమన్ ఇరానీ, ఖుష్బూ, ఆది పినిశెట్టి, రావు రమేశ్, మురళీ శర్మ ముఖ్య పాత్రలు పోషించగా కీర్తి సురేష్, అను ఎమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బేనర్పై రాధాకృష్ణ నిర్మించిన ఈ చిత్రం జనవరి 10న విడుదల కానున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్గా ఆర్యభట్ట హౌస్..!!
- ఏడాదిలో 5 ఉల్లంఘనలకు పాల్పడితే.. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..!!
- ఆన్లైన్ మోసగాళ్లకు కోర్టు షాక్..







