చంద్రన్న క్రిస్మస్ కానుకలు
- December 20, 2017
పేదవాడు పండుగలను ఆనందంగా జరుపుకునేందుకు చంద్రన్న ప్రత్యేక కానుకలను అందిస్తున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. విజయవాడ మొగల్రాజపురం కస్తూరిబాయిపేటలో బుధవారం చంద్రన్న క్రిస్మస్, సంక్రాంతి కానుకల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, స్థానిక ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, కలెక్టర్ బి.లక్ష్మీకాంతంతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పత్తిపాటి మాట్లాడుతూ.. జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని చౌకధర దుకాణాల్లోనూ పంచదారను కార్డుదారులకు అందించనున్నామని తెలిపారు.
చంద్రన్న క్రిస్మస్ కానుకగా కిలో గోధుమ పిండి, పామాయిల్, కందిపప్పు, పచ్చి శనగపప్పు, బెల్లం అర కిలో, నెయ్యి 100 గ్రాములు ఉచితంగా అందిస్తున్నామన్నారు. దేవినేని ఉమా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా పేదలకు చంద్రన్న కానుకలు ఇస్తున్నట్లు తెలిపారు. కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. అన్నివర్గాల ప్రజల అభ్యున్నతికీ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కలెక్టర్ లక్ష్మీకాంతం మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా 3.20 లక్షలకు పైగా చంద్రన్న క్రిస్మస్ కానుకలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల