మొబైల్ ఇంటర్నెట్ డేటా వినియోగంలో భారత్ అగ్రస్థానం
- December 22, 2017మొబైల్ ఇంటర్నెట్ డేటా వినియోగంలో అమెరికా, చైనాలను దాటేసి మనదేశం దూసుకుపోతోంది. ఇందుకు ప్రధాన కారణం రిలయన్స్ జియోనే అని చెప్పుకోవాలి. ఉచిత మంత్రంతో మార్కెట్లోకి దూసుకువచ్చి జియో ఇచ్చిన పోటీతో ఇతర టెలికాం కంపెనీలు కూడా తక్కువ ధరకే డేటాను ఇస్తున్నాయి. నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్కాంత్ ఈ రోజు ట్వీట్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా మొబైల్ డేటా వినియోగిస్తోన్న దేశాల్లో మన దేశం అగ్రస్థానంలో నిలిచిందని, భారతీయులు నెలకు 150 కోట్ల గిగాబైట్ల డేటాను వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. భారత్లో అధిక శాతం వినియోగదారులు సోషల్ మీడియా కోసమే డేటాను ఉపయోగిస్తున్నారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..