దుబాయి: 65,000 దిర్హం లను స్వాహా చేసిన వేలెట్ పార్కింగ్ సిబ్బంది
- November 18, 2015
దుబాయి వేలెట్ పార్కింగ్ సిబ్బంది ఒకే కార్డును అనేకసార్లు ఉపయోగించి 65,000 దిర్హం లను కాజేశారు. దుబాయి పొలిసు శాఖ వారి జనరల్ డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్స్ అండ్ క్రిమినాలజీ హెడ్ అహ్మద్ మాతర్ అల్ ముహైరీ , సులభంగా చేరిపివేయగల ఒక ప్రత్యేక తరహా పెన్ ను ఉపయోగించి కారు నెంబర్లను రాసి, మరల చెరిపివేసి కొత్త నెంబర్లను రాస్తూ వేలేట్ పార్కింగ్ కంపెనీ నుండి 65,000 దిర్హం లను కాజేసినట్టు తెలియజేసారు. కాజేసిన సొమ్మును పంచుకోవడంలో గొడవపడి, వారిలో ఒకరు కంపెనీ యజమానికి ఫిర్యాదు చేయడంతో డొంకంతా కదిలి, పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేసారు. ప్రధాన నిందితుడు, నేరం చేసినట్టు నిరాకరించినప్పటికీ, ఒకే కార్డుపై అనేక సార్లు చేతిరాతతో నెంబర్లు రాసినట్టు ఫోర్జరీ సెక్షన్ వారు ధ్రువీకరించారు.
తాజా వార్తలు
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!









