బీసీసీఐ జనరల్ మేనేజర్గా సబా కరీం
- December 23, 2017
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ నూతన జనరల్ మేనేజర్గా టీమిండియా మాజీ వికెట్ కీపర్ సబా కరీం నియమితులయ్యారు. జనవరి 1 నుంచి ఆయన పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.
ఎంవీ శ్రీధర్ రాజీనామాతో జనరల్ మేనేజర్ పోస్టు ఖాళీ అయింది. దీంతో ఈ ఏడాది అక్టోబరు మధ్యలో జనరల్ మేనేజర్-క్రికెట్ ఆపరేషన్స్ కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. జాతీయ, అంతర్జాతీయ క్రికెట్ ఆపరేషన్స్లో నైపుణ్యం గల వ్యక్తుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్టు అప్పట్లో బీసీసీఐ ప్రకటించింది. వచ్చిన దరఖాస్తులను వడపోసి సాబా కరీంను బీసీసీఐ ఎంపిక చేసింది.
కరీం భారత తరపున ఒక టెస్ట్ మ్యాచ్, 34 వన్డే మ్యాచులు ఆడాడు. 1997 నుంచి 2000 వరకు భారత్కు ప్రాతినిధ్యం వహించాడు. అలాగే బిహార్ తరపున వందకు పైగా ఫస్ట్-క్లాస్ మ్యాచులు ఆడి 7వేలకు పైగా పరుగులు చేశాడు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







