బీసీసీఐ జనరల్ మేనేజర్గా సబా కరీం
- December 23, 2017
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ నూతన జనరల్ మేనేజర్గా టీమిండియా మాజీ వికెట్ కీపర్ సబా కరీం నియమితులయ్యారు. జనవరి 1 నుంచి ఆయన పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.
ఎంవీ శ్రీధర్ రాజీనామాతో జనరల్ మేనేజర్ పోస్టు ఖాళీ అయింది. దీంతో ఈ ఏడాది అక్టోబరు మధ్యలో జనరల్ మేనేజర్-క్రికెట్ ఆపరేషన్స్ కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. జాతీయ, అంతర్జాతీయ క్రికెట్ ఆపరేషన్స్లో నైపుణ్యం గల వ్యక్తుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్టు అప్పట్లో బీసీసీఐ ప్రకటించింది. వచ్చిన దరఖాస్తులను వడపోసి సాబా కరీంను బీసీసీఐ ఎంపిక చేసింది.
కరీం భారత తరపున ఒక టెస్ట్ మ్యాచ్, 34 వన్డే మ్యాచులు ఆడాడు. 1997 నుంచి 2000 వరకు భారత్కు ప్రాతినిధ్యం వహించాడు. అలాగే బిహార్ తరపున వందకు పైగా ఫస్ట్-క్లాస్ మ్యాచులు ఆడి 7వేలకు పైగా పరుగులు చేశాడు.
తాజా వార్తలు
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!







