ప్రియాంక కు డాక్టరేట్
- December 23, 2017
ముంబయి: బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాకు అరుదైన గౌరవం దక్కింది.బరేలీ అంతర్జాతీయ వర్శిటీ ఆమెకు గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేయనుంది. ఆమె స్వస్థలం యూపీలోని బరేలీలో ఈ గౌరవం అందుకోనుండటం విశేషం. ఆదివారం ఆమెకు వర్శిటీ ఛాన్సలర్ కేశవ్ కుమార్ డాక్టరేట్ను ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి హర్షవర్థన్, యూపీ ఆర్థికమంత్రి రాజేశ్ అగర్వాల్ హాజరుకానున్నారు.
దాదాపు ఐదేళ్ల తర్వాత ప్రియాంక స్వస్థలానికి వస్తున్న నేపథ్యంలో ఆమెకు జ్ఞాపికను అందజేయనున్నారు. తన కుమార్తెకు డాక్టరేట్ ప్రకటించడం పట్ల ప్రియాంక తల్లి మధు చోప్రా హర్షం వ్యక్తంచేశారు. కాగా, విద్య, వైద్యం, బాలికలకు విద్య అందించే లక్ష్యంతో ప్రియాంక ఓ స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నారు. 2000లో ప్రపంచ సుందరిగా ఎంపికైన తర్వాత ఆమె ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించారు. ప్రస్తుతం ఆమె యునిసెఫ్ అంతర్జాతీయ సౌహార్ద రాయబారిగానూ ఉన్నారు. గతేడాది పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు.అటు సినిమా రంగానికి, ఇటు సామాజిక అంశాలపై పోరాడుతున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







