రాష్ట్ర టెన్నిస్ చాంపియన్షిప్ పోటీలు ప్రారంభం
- December 23, 2017
విజయవాడ: స్పోర్ట్స్ అథారిటి ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గోల్డ్ స్లామ్ స్పోర్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో తొలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి టెన్నిస్ ర్యాంకింగ్ చాంపియన్షిప్ను శనివారం ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ టెన్నిస్ స్టేడియంలో క్రీడల మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ ఒక వ్యక్తి పరిపూర్ణ అభివృద్ధికి క్రీడలు ఎంతో దోహదపడతాయన్నారు. ఈ పోటీలు క్రీడాకారులకు మంచి సదావకాశమన్నారు. ప్రభుత్వం నైపుణ్యం ఉన్న క్రీడాకారులకు సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో శాప్ ఓఎస్డీ పి.రామకృష్ణ, డీఎస్డీవో బి.శ్రీనివాసరావు, గోల్డ్స్లామ్ స్పోర్ట్స్ ఎండీ తిరుమల రాజు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!