టీటీఎల్: ఫ్రాంఛైజీల కోసం బిడ్ల ఆహ్వానం
- December 23, 2017హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) జనవరి 26 నుంచి ఫిబ్రవరి 20 వరకు తెలంగాణ టీ20 లీగ్ (టీటీఎల్) నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు లీగ్ ఫ్రాంఛైజీల యాజమాన్య హక్కులు కట్టబెట్టేందుకు ఆసక్తిగల కంపెనీలు, సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించింది. టోర్నీలో హైదరాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్, వరంగల్, మెదక్, రంగారెడ్డి, కరీంనగర్ జట్లు ఉంటాయి. జట్టు కనీస ధర రూ.12.50 లక్షలు. స్పాన్సర్ల భాగస్వామ్యాన్ని కూడా హెచ్సీఏ కోరుతోంది. దరఖాస్తులు శుక్రవారం నుంచి హెచ్సీఏలో అందుబాటులో ఉన్నాయి.
ఆసక్తిగల సంస్థలు డిసెంబరు 30 సాయంత్రం నాలుగు గంటల లోపు సంబంధిత పత్రాలను మూసి ఉంచిన కవర్లో ఉంచి ఉప్పల్ స్టేడియంలో నిర్దేశిత డబ్బాలో వేయాల్సివుటుంది. మరిన్ని వివరణలకు ఈ మెయిల్ [email protected] లో సంప్రదించవచ్చు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం
- దుబాయ్లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!