టీటీఎల్: ఫ్రాంఛైజీల కోసం బిడ్ల ఆహ్వానం
- December 23, 2017
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) జనవరి 26 నుంచి ఫిబ్రవరి 20 వరకు తెలంగాణ టీ20 లీగ్ (టీటీఎల్) నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు లీగ్ ఫ్రాంఛైజీల యాజమాన్య హక్కులు కట్టబెట్టేందుకు ఆసక్తిగల కంపెనీలు, సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించింది. టోర్నీలో హైదరాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్, వరంగల్, మెదక్, రంగారెడ్డి, కరీంనగర్ జట్లు ఉంటాయి. జట్టు కనీస ధర రూ.12.50 లక్షలు. స్పాన్సర్ల భాగస్వామ్యాన్ని కూడా హెచ్సీఏ కోరుతోంది. దరఖాస్తులు శుక్రవారం నుంచి హెచ్సీఏలో అందుబాటులో ఉన్నాయి.
ఆసక్తిగల సంస్థలు డిసెంబరు 30 సాయంత్రం నాలుగు గంటల లోపు సంబంధిత పత్రాలను మూసి ఉంచిన కవర్లో ఉంచి ఉప్పల్ స్టేడియంలో నిర్దేశిత డబ్బాలో వేయాల్సివుటుంది. మరిన్ని వివరణలకు ఈ మెయిల్ [email protected] లో సంప్రదించవచ్చు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









