క్రిస్మస్ వేడుకలను ప్రారంభించిన చంద్రబాబు....!!
- December 23, 2017
ఏపీ రాజధానిలో ప్రారంభమైన క్రిస్మస్ వేడుకలు అంబరాన్నంటాయి. గుంటూరులోని లూథరన్ స్కూల్ గ్రౌండ్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో తొలిరోజు కార్యక్రమాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. విద్యుత్ కాంతులతో ఏర్పాటు చేసిన క్రిస్మస్ ట్రీని ఆవిష్కరించారు. క్యాండిల్ వెలిగించి క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
సేవ, కరుణ, ప్రేమను బోధించేందుకే ఏసుక్రీస్తు మానవరూపంలో జన్మించారని చంద్రబాబు అన్నారు. క్రిస్టియన్ల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం 75 కోట్లు కేటాయించిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో చర్చిల మరమ్మతులకు మూడు నుంచి ఐదు లక్షల చొప్పున కేటాయిస్తామన్నారు. చొప్పున కేటాయిస్తామన్నారు. వచ్చే క్రిస్మస్ నాటికి గుంటూరులో ఏపీ క్రిస్టియన్ భవన్ సిద్ధం చేస్తామన్నారు చంద్రబాబు.
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు మంత్రులు, ప్రజా ప్రతినిధులతోపాటూ వివిధ ప్రాంతాల నుంచి క్రైస్తవులు భారీగా తరలివచ్చారు. ప్రత్యేక ప్రార్థనలు, కార్యక్రమాలు నిర్వహించారు. ఆర్కెస్ట్రా బృందం క్రిస్మస్ పాటలతో అలరించింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







