క్రిస్మస్ వేడుకలను ప్రారంభించిన చంద్రబాబు....!!
- December 23, 2017
ఏపీ రాజధానిలో ప్రారంభమైన క్రిస్మస్ వేడుకలు అంబరాన్నంటాయి. గుంటూరులోని లూథరన్ స్కూల్ గ్రౌండ్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో తొలిరోజు కార్యక్రమాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. విద్యుత్ కాంతులతో ఏర్పాటు చేసిన క్రిస్మస్ ట్రీని ఆవిష్కరించారు. క్యాండిల్ వెలిగించి క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
సేవ, కరుణ, ప్రేమను బోధించేందుకే ఏసుక్రీస్తు మానవరూపంలో జన్మించారని చంద్రబాబు అన్నారు. క్రిస్టియన్ల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం 75 కోట్లు కేటాయించిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో చర్చిల మరమ్మతులకు మూడు నుంచి ఐదు లక్షల చొప్పున కేటాయిస్తామన్నారు. చొప్పున కేటాయిస్తామన్నారు. వచ్చే క్రిస్మస్ నాటికి గుంటూరులో ఏపీ క్రిస్టియన్ భవన్ సిద్ధం చేస్తామన్నారు చంద్రబాబు.
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు మంత్రులు, ప్రజా ప్రతినిధులతోపాటూ వివిధ ప్రాంతాల నుంచి క్రైస్తవులు భారీగా తరలివచ్చారు. ప్రత్యేక ప్రార్థనలు, కార్యక్రమాలు నిర్వహించారు. ఆర్కెస్ట్రా బృందం క్రిస్మస్ పాటలతో అలరించింది.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!