తలాల్ ను విడిపించాలనంటే భారీగా జరిమానా చెల్లించాలి
- December 24, 2017
రియాద్:ప్రపంచంలో అత్యంత ధనవంతుల్లో ఒకడుగా పేరొందిన అల్ వాలీద్ బిన్ తలాల్ను విడిపించేందుకు సౌదీ ప్రభుత్వం 6 బిలియన్ డాలర్లను కోరుతోంది. ప్రపంచంలోని పలు దేశాలతో అత్యంత సన్నిహిత సంబంధాలున్న తలాల్ ప్రస్తుతం జైల్లో మగ్గుతున్నాడు.
ఈ ఏడాది నవంబర్ 5న అల్ వాలిద్ బిన్ తలాల్ అరెస్ట్ అయ్యారు. సౌదీ అరేబియా ప్రభుత్వం ఆయనను అరెస్ట్ చేసింది. అవినీతి నిర్మూలనను కారణంగా చూపుతూ వాలిద్ బిన్ తలాల్తో పాటు సౌదీ యువరాజ్ మహ్మద్ బిన్ సల్మాన్ అరెస్ట్ చేయించారు.
ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా ఉన్న తలాల్ మాత్రం జైలు నుండి బయట పడేందుకు ప్రభుత్వం విధించిన జరిమానాను చెల్లించడమే మార్గంగా ఉంది. ఈ జరిమానాను చెల్లిస్తేనే ఆయనను జైలు నుండి విడుదల చేస్తారు.
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకడుగా అల్ వాలీద్ బిన్ తలాల్ కు పేరుంది. అయితే ఆయన ప్రస్తుతం సౌదీ జైల్లో మగ్గుతున్నాడు. ఆయనను జైలు నుండి విడుదల చేసేందుకు ప్రభుత్వం సుముఖంగానే ఉందని వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక తెలిపింది. అయితే సుమారు 6 బిలియన్ డాలర్ల జరిమానాను చెల్లిస్తేనే జైలు నుండి విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించినట్టు ఆ పత్రిక ప్రకటించింది.
ప్రపంచంలోని పలు దేశాల్లో తలాల్కు వ్యాపారాలున్నాయి. అంతేకాదు పలు దేశాల ప్రభుత్వాలతో కూడ ఆయనకు సత్సంబంధాలున్నాయి. అయితే సౌదీ ప్రభుత్వం తలాల్ ను అరెస్ట్ చేసినప్పటీ ఈ పలుకుబడి ఏ మాత్రం ఉపయోగపడలేదు. సౌదీ ప్రభుత్వం చెప్పినట్టుగా జరిమానాను చెల్లిస్తేనే ఆయన జైలు నుండి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక తెలిపింది.
ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో అల్ వాలీద్ బిన్ తలాల్ ఒకరు. ఆయన ఆస్తి సుమారు 16 బిలియన్ డాలర్లు. ఇండియా కరెన్సీలో లక్ష కోట్లకు పైగా ఉంటుంది. పెద్ద పెద్ద వ్యాపారాలున్నాయి. ప్రపంచంలోని పలు దేశాల్లో తలాల్ వ్యాపార సామ్యాజ్యం విస్తరించింది.
అనేకమంది యువరాజులను విడుదల చేయించేందుకు భారీ జరిమానాలను చెల్లించారు. కానీ తలాల్ను విడిపించేందుకు ఎవరూ ముందుకురాలేదు. తలాల్ను విడిపించాలంటే పెద్ద మొత్తంలో జరిమానాను చెల్లించాల్సి రావడమే కారణమని వాల్ స్ట్రీట్ జర్నల్ ఆ కథనంలో తెలిపింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







