పొగమంచు: ఉద్యోగులకు 'ఆలస్యం'పై వెసులుబాటు
- December 25, 2017
పొగమంచు నేపథ్యంలో యూఏఈ ప్రభుత్వ ఉద్యోగులకు ఉదయం ఫింగర్ ప్రింట్ అటెండెన్స్ నుంచి కొంత ఊరట లభించింది. అటెండెంట్స్పై ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని ఉన్నతాధికారులు, ఉద్యోగులకు సూచించారు. వాతావరణ పరిస్థితులు బాగోనందున, పొగమంచు కారణంగా వేగంగా వాహనాలు నడిపితే ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా ఇవే పరిస్థితులు ఉండడంతో ఉద్యోగులకు హాజరు సమయం విషయంలో కొంత మినహాయింపునిచ్చారు. అబుదాబీ, దుబాయ్ తదితర ప్రాంతాల్లో వరుసగా మూడో రోజు కూడా పొగమంచు వాహనదారుల్ని బాగా ఇబ్బంది పెట్టింది. షవమాక్, అల్ షమాఖ్, అల్ రహబాహ్, అల్ సహామా మరియు అల్ అయిన్ ఎయిర్పోర్టు ప్రాంతాల్లోనూ పొగమంచు బాగా ఎక్కువగా కనిపించింది.
తాజా వార్తలు
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!