ఆస్ట్రేలియాలో కన్నుమూసిన సూర్యాపేటవాసి
- December 25, 2017
సూర్యాపేట జిల్లాకు చెందిన ఆదినారాయణ రెడ్డి (36) అనే వ్యక్తి ఆస్ట్రేలియాలో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం ఇంజంవారిగూడానికి చెందిన ఈయన ఇన్ఫోసిస్ లో సాఫ్ట్వేర్ ఇంజనీరుగా పని చేస్తున్నాడు. ఆరు నెలల క్రితం ఆదినారాయణరెడ్డిని ఈ సంస్థ యాజమాన్యం సిడ్నీకి పంపింది. అయితే ఇటీవలే ఈయన మృతి మిస్టరీగా మారింది.
ఐదేళ్ళ కిందట ఈయనకు మిర్యాలగూడ నివాసి శిరీషతో వివాహం జరిగినట్టు తెలిసింది. వీరికి ఇద్దరు కవల పిల్లలున్నారు. మరో నెల రోజుల్లో తన భార్య, కుమార్తెలను ఆస్ట్రేలియా తీసుకువెళ్లేందుకు ఆదినారాయణ రెడ్డి ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇంతలోనే ఈ దారుణం జరిగింది. తన భర్త మృతితో శిరీష కన్నీరు మున్నీరవుతోంది. ఆయన మరణంపై ఇన్ఫోసిస్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా సరైన సమాధానం రాలేదని వాపోతోంది.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







