ఆస్ట్రేలియాలో కన్నుమూసిన సూర్యాపేటవాసి

- December 25, 2017 , by Maagulf
ఆస్ట్రేలియాలో కన్నుమూసిన సూర్యాపేటవాసి

సూర్యాపేట జిల్లాకు చెందిన ఆదినారాయణ రెడ్డి (36) అనే వ్యక్తి ఆస్ట్రేలియాలో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం ఇంజంవారిగూడానికి చెందిన ఈయన ఇన్ఫోసిస్ లో సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా పని చేస్తున్నాడు. ఆరు నెలల క్రితం ఆదినారాయణరెడ్డిని ఈ సంస్థ యాజమాన్యం సిడ్నీకి పంపింది. అయితే ఇటీవలే ఈయన మృతి మిస్టరీగా మారింది.

ఐదేళ్ళ కిందట ఈయనకు మిర్యాలగూడ నివాసి శిరీషతో వివాహం జరిగినట్టు తెలిసింది. వీరికి ఇద్దరు కవల పిల్లలున్నారు. మరో నెల రోజుల్లో తన భార్య, కుమార్తెలను ఆస్ట్రేలియా తీసుకువెళ్లేందుకు ఆదినారాయణ రెడ్డి ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇంతలోనే ఈ దారుణం జరిగింది. తన భర్త మృతితో శిరీష కన్నీరు మున్నీరవుతోంది. ఆయన మరణంపై ఇన్ఫోసిస్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా సరైన సమాధానం రాలేదని వాపోతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com