ఆస్ట్రేలియాలో కన్నుమూసిన సూర్యాపేటవాసి
- December 25, 2017
సూర్యాపేట జిల్లాకు చెందిన ఆదినారాయణ రెడ్డి (36) అనే వ్యక్తి ఆస్ట్రేలియాలో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం ఇంజంవారిగూడానికి చెందిన ఈయన ఇన్ఫోసిస్ లో సాఫ్ట్వేర్ ఇంజనీరుగా పని చేస్తున్నాడు. ఆరు నెలల క్రితం ఆదినారాయణరెడ్డిని ఈ సంస్థ యాజమాన్యం సిడ్నీకి పంపింది. అయితే ఇటీవలే ఈయన మృతి మిస్టరీగా మారింది.
ఐదేళ్ళ కిందట ఈయనకు మిర్యాలగూడ నివాసి శిరీషతో వివాహం జరిగినట్టు తెలిసింది. వీరికి ఇద్దరు కవల పిల్లలున్నారు. మరో నెల రోజుల్లో తన భార్య, కుమార్తెలను ఆస్ట్రేలియా తీసుకువెళ్లేందుకు ఆదినారాయణ రెడ్డి ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇంతలోనే ఈ దారుణం జరిగింది. తన భర్త మృతితో శిరీష కన్నీరు మున్నీరవుతోంది. ఆయన మరణంపై ఇన్ఫోసిస్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా సరైన సమాధానం రాలేదని వాపోతోంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







