ఆస్ట్రేలియాలో కన్నుమూసిన సూర్యాపేటవాసి
- December 25, 2017
సూర్యాపేట జిల్లాకు చెందిన ఆదినారాయణ రెడ్డి (36) అనే వ్యక్తి ఆస్ట్రేలియాలో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం ఇంజంవారిగూడానికి చెందిన ఈయన ఇన్ఫోసిస్ లో సాఫ్ట్వేర్ ఇంజనీరుగా పని చేస్తున్నాడు. ఆరు నెలల క్రితం ఆదినారాయణరెడ్డిని ఈ సంస్థ యాజమాన్యం సిడ్నీకి పంపింది. అయితే ఇటీవలే ఈయన మృతి మిస్టరీగా మారింది.
ఐదేళ్ళ కిందట ఈయనకు మిర్యాలగూడ నివాసి శిరీషతో వివాహం జరిగినట్టు తెలిసింది. వీరికి ఇద్దరు కవల పిల్లలున్నారు. మరో నెల రోజుల్లో తన భార్య, కుమార్తెలను ఆస్ట్రేలియా తీసుకువెళ్లేందుకు ఆదినారాయణ రెడ్డి ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇంతలోనే ఈ దారుణం జరిగింది. తన భర్త మృతితో శిరీష కన్నీరు మున్నీరవుతోంది. ఆయన మరణంపై ఇన్ఫోసిస్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా సరైన సమాధానం రాలేదని వాపోతోంది.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!