బాబాయ్.. అబ్బాయ్ లు వెబ్ సిరీస్ తో సందడి..!!
- December 25, 2017
తెలుగు లో వెబ్ సిరీస్ కు ప్రాముఖ్యం తెచ్చింది.. మెగా తనయ నీహారిక అని చెప్పవచ్చు.. అప్పటి నుంచి వెబ్ సిరీస్ హవా ఓ రేంజ్ లో కొనసాగుతున్నది. నాగార్జున, బాహుబలి వంటి సినిమాను నిర్మించిన బడా నిర్మాతలు సైతం వెబ్ సిరీస్ నిర్మాణ రంగంలో అడుగు పెట్టారు. వెబ్ సిరీస్ లో నటించడానికి ఇప్పటి వరకూ ఏ బడా హీరో ఆసక్తిని చూపించలేదు.. తాజాగా ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ హత్య నేపథ్య అంశంతో... "ఎల్ టీటీఈ" అనే పేరుతో ఓ వెబ్ సిరీస్ రూపొందనున్నది. ఈ వెబ్ సిరీస్ లో ఐపీఎస్ అధికారి కార్తికేయన్ గా వెంకటేష్, ఓ కీలక పాత్రలో రానా నటించనున్నాడు అని టాక్ వినిపిస్తోంది. కథగా చెప్పాలంటే మూడు గంటల్లో పూర్తిగా చెప్పడం కష్టం అని.. అందుకనే ఈ స్టోరీని సినిమాకంటే.. వెన్ సిరీస్ గా ఐతే బాగుంటుందని భావించి నట్లు దర్శకుడు ఏఎంఆర్ రమేశ్ చెప్పారు.. ఈ వెబ్ సిరీస్ ను దక్షిణాది భాషలతో పాటు.. హిందీలో కూడా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల