ప్రియుడితో నయన క్రిస్మస్
- December 26, 2017
నయనతార.. మళ్లీ వార్తల్లోకి వచ్చేసింది. ఈసారి కోరుకున్న ప్రియుడితో కలిసి క్రిస్మస్ ట్రీ ముందు నిలబడుతూ దిగిన సెల్ఫీ వైరల్ అయ్యింది. ఇంతకీ స్పెషలేంటి అంటూ చర్చించుకోవడం సినీలవర్స్ వంతైంది. నయనతార గ్లామర్ ఇండస్ర్టీలోకి వచ్చి 14 ఏళ్లు పూర్తి చేసుకుంది. దీనికితోడు ఆమె నటించిన సినిమా ఈనెల 22న రిలీజైంది. అది కూడా హిట్ కావడంతో ఫుల్జోష్లో వుంది. అన్నట్లు ఈసారి క్రిస్మస్ వేడుకలను ఫ్యామిలీ, ప్రియుడితో కలిసి చెన్నైలోని కొత్త అపార్ట్మెంట్లో జరుపుకుంది.
విఘ్నేష్ శివన్ ఇచ్చిన సలహా మేరకు 10 అడుగుల పొడవున్న మంచు తరహాలోవున్న క్రిస్మస్ చెట్టుని దుబాయ్ నుంచి తెప్పించింది. ఇంట్లోనే ప్రియుడితో కలిసి దిగిన సెల్ఫీ ఇది. ఈ సందర్భంగా మ్యారేజ్ గురించి ఏదో ఒక విషయం రివీల్ చేస్తుందని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. ప్రస్తుతం 'జై సింహా' వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుండగా, సైరా నరసింహారెడ్డిలోనూ కీలకపాత్ర పోషించనుంది నయనతార.
తాజా వార్తలు
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం







