ప్రియుడితో నయన క్రిస్మస్
- December 26, 2017
నయనతార.. మళ్లీ వార్తల్లోకి వచ్చేసింది. ఈసారి కోరుకున్న ప్రియుడితో కలిసి క్రిస్మస్ ట్రీ ముందు నిలబడుతూ దిగిన సెల్ఫీ వైరల్ అయ్యింది. ఇంతకీ స్పెషలేంటి అంటూ చర్చించుకోవడం సినీలవర్స్ వంతైంది. నయనతార గ్లామర్ ఇండస్ర్టీలోకి వచ్చి 14 ఏళ్లు పూర్తి చేసుకుంది. దీనికితోడు ఆమె నటించిన సినిమా ఈనెల 22న రిలీజైంది. అది కూడా హిట్ కావడంతో ఫుల్జోష్లో వుంది. అన్నట్లు ఈసారి క్రిస్మస్ వేడుకలను ఫ్యామిలీ, ప్రియుడితో కలిసి చెన్నైలోని కొత్త అపార్ట్మెంట్లో జరుపుకుంది.
విఘ్నేష్ శివన్ ఇచ్చిన సలహా మేరకు 10 అడుగుల పొడవున్న మంచు తరహాలోవున్న క్రిస్మస్ చెట్టుని దుబాయ్ నుంచి తెప్పించింది. ఇంట్లోనే ప్రియుడితో కలిసి దిగిన సెల్ఫీ ఇది. ఈ సందర్భంగా మ్యారేజ్ గురించి ఏదో ఒక విషయం రివీల్ చేస్తుందని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. ప్రస్తుతం 'జై సింహా' వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుండగా, సైరా నరసింహారెడ్డిలోనూ కీలకపాత్ర పోషించనుంది నయనతార.
తాజా వార్తలు
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ







