మంత్రి కేటీఆర్‌కు అరుదైన ఆహ్వానం

- December 27, 2017 , by Maagulf
మంత్రి కేటీఆర్‌కు అరుదైన ఆహ్వానం

హైదరాబాద్‌: హైదరాబాద్‌: తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌కు అరుదైన ఆహ్వానం అందింది. జనవరి 17, 18 తేదీల్లో దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనాలని ఆయనకు ఆహ్వానం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడంపై ఆయన హర్షం వ్యక్తంచేశారు. హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో ఆయన కీలక పాత్ర పోషించారు. ఈ సదస్సును విజయవంతంగా నిర్వహించడంలో ఆయన చేసిన కృషికి గాను ప్రశంసల్ని సైతం అందుకున్న విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com