కోటి రూపాయల స్కాం నిందితుడు.. వాషింగ్ మెషీన్లో చిక్కాడు
- December 27, 2017
చేసిన పాపం చెబితే పోతుందంటారు. మరి ఇతగాడు బీఈడీ అడ్మిషన్లు ఇప్పిస్తానని విద్యార్థుల్ని మోసం చేసి కోటి రూపాయలు పోగేసుకుని ఎంచక్కా ఉడాయించాడు. 15 ఏళ్లుగా పోలీసులు ఇతడి కోసం గాలిస్తున్నా దొరక్కుండా పారిపోతున్నాడు. ముంబై జూహూ ప్రాంతానికి చెందిన మనోజ్ తివారీ 2002లో విద్యార్థులను ఎరగా చేసుకుని డబ్బు సంపాదించాలనుకున్నాడు. బీఈడీ సీట్లను ఆశగా చూపించాడు. పెద్ద మొత్తంలో వసూలు చేసి కోటి రూపాయలకు పైగా సంపాదించాడు. విద్యార్థులు జరిగిన మోసాన్ని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేయగా అతడిని అరెస్టు చేయడానికి పోలీసులు రంగం సిద్దం చేశారు.
అయితే గత 15 ఏళ్లుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సోమవారం జూహూ ప్రాంతంలో ఉన్న అతడి నివాసానికి చేరుకున్నారు. మూడు గంటల పాటు ఇంట్లో అతడి కోసం వెతికారు. ఎక్కడా కనిపించలేదు. అయితే వాషింగ్ మెషీన్ డోర్ దగ్గర కుప్పగా బట్టలు పడి ఉండడాన్ని గమనించారు. అనుమానం వచ్చి మెషీన్ డోర్ ఓపెన్ చేసి చూడగా అందులో మనోజ్ కనిపించాడు. భార్యే అతడిని అందులో దాచిందని తెలుసుకున్న పోలీసులు అవాక్కయి అతడిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







