కోటి రూపాయల స్కాం నిందితుడు.. వాషింగ్ మెషీన్లో చిక్కాడు
- December 27, 2017
చేసిన పాపం చెబితే పోతుందంటారు. మరి ఇతగాడు బీఈడీ అడ్మిషన్లు ఇప్పిస్తానని విద్యార్థుల్ని మోసం చేసి కోటి రూపాయలు పోగేసుకుని ఎంచక్కా ఉడాయించాడు. 15 ఏళ్లుగా పోలీసులు ఇతడి కోసం గాలిస్తున్నా దొరక్కుండా పారిపోతున్నాడు. ముంబై జూహూ ప్రాంతానికి చెందిన మనోజ్ తివారీ 2002లో విద్యార్థులను ఎరగా చేసుకుని డబ్బు సంపాదించాలనుకున్నాడు. బీఈడీ సీట్లను ఆశగా చూపించాడు. పెద్ద మొత్తంలో వసూలు చేసి కోటి రూపాయలకు పైగా సంపాదించాడు. విద్యార్థులు జరిగిన మోసాన్ని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేయగా అతడిని అరెస్టు చేయడానికి పోలీసులు రంగం సిద్దం చేశారు.
అయితే గత 15 ఏళ్లుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సోమవారం జూహూ ప్రాంతంలో ఉన్న అతడి నివాసానికి చేరుకున్నారు. మూడు గంటల పాటు ఇంట్లో అతడి కోసం వెతికారు. ఎక్కడా కనిపించలేదు. అయితే వాషింగ్ మెషీన్ డోర్ దగ్గర కుప్పగా బట్టలు పడి ఉండడాన్ని గమనించారు. అనుమానం వచ్చి మెషీన్ డోర్ ఓపెన్ చేసి చూడగా అందులో మనోజ్ కనిపించాడు. భార్యే అతడిని అందులో దాచిందని తెలుసుకున్న పోలీసులు అవాక్కయి అతడిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించారు.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









