పర్యటకులకు తీపి కబురు తెలిపిన సౌదీ ప్రభుత్వం
- December 28, 2017
రియాద్: సౌదీఅరేబియా 2018 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న విలువ ఆధారిత పన్ను (వ్యాట్) పర్యటకులకు భారం కానున్నదని భావిస్తున్న అక్కడి ప్రభుత్వం తిరిగి చెల్లించేలా సంస్కరణలు చేపట్టనుంది. విమాన టిక్కెట్లు కొనుగోలు సమయంలో పర్యటకులు చెల్లించిన వ్యాట్ను తిరిగి ఇచ్చేందుకు అవసరమైన ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఈ సమాచారాన్ని జనరల్ అథారిటీ ఆఫ్ జకాత్ అండ్ ట్యాక్స్ అధికారులు ఈ విషయాన్ని అక్టోబర్ నెలలోనే ప్రకటించారు. జనవరి 1 నుంచే వ్యాట్ అమల్లోకి రానున్నదని, కానీ పర్యటకులకు జనవరి 1 నుంచే తిరిగి చెల్లించడం కుదరదని తొలుత తెలిపారు. ఈ వెసులుబాటు కల్పించేందుకు అవసరమైన ప్రతిపాదనలు జరుగుతున్నాయని, ఓ స్పష్టత వచ్చిన తర్వాత పర్యటలకులకు వ్యాట్ను రిఫండ్ చేయనున్నామని అధికారులు పేర్కొన్నారు. ఇదిలావుండగా గల్ఫ్ దేశాలైన యూఏఈ, సౌదీఅరేబియాలో జనవరి 1 నుంచి 5 శాతం వ్యాట్ అమల్లోకి రానుంది. వివిధ వస్తువులు, సేవలపై ఈ భారం మోపనున్నారు .
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







