బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన కాబుల్
- December 28, 2017
ఆఫ్గాన్ రాజధాని కాబూల్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. నగరంలోని సాంస్కృతిక కేంద్రంవద్ద గురువారం ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సుమారు 40 మంది చనిపోయినట్లు ఆఫ్గాన్ హోంశాఖ వెల్లడించింది. మరో 30 మందికి పైగా గాయపడ్డారు. బాధితుల్లో విలేకరులు, మహిళలు, చిన్నారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. 'వెంటవెంటనే రెండు పేలుళ్లు సంభవించాయి. ఘటన జరిగిన సమీపంలో ఆఫ్గాన్ వాయిస్ ఏజెన్సీ ఉంది. దాని లక్ష్యంగా చేసుకునే దాడికి పాల్పడి ఉంటారు' అని హోంశాఖ అధికార ప్రతినిధి నజీబ్ దానిశ్ తెలిపారు. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే మరో పేలుడు శబ్దం వినిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో దాడి కొనసాగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. తాజాగా జరిగిన ఘటన తామే చేశామని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు వెల్లడించారు.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







