బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన కాబుల్
- December 28, 2017
ఆఫ్గాన్ రాజధాని కాబూల్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. నగరంలోని సాంస్కృతిక కేంద్రంవద్ద గురువారం ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సుమారు 40 మంది చనిపోయినట్లు ఆఫ్గాన్ హోంశాఖ వెల్లడించింది. మరో 30 మందికి పైగా గాయపడ్డారు. బాధితుల్లో విలేకరులు, మహిళలు, చిన్నారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. 'వెంటవెంటనే రెండు పేలుళ్లు సంభవించాయి. ఘటన జరిగిన సమీపంలో ఆఫ్గాన్ వాయిస్ ఏజెన్సీ ఉంది. దాని లక్ష్యంగా చేసుకునే దాడికి పాల్పడి ఉంటారు' అని హోంశాఖ అధికార ప్రతినిధి నజీబ్ దానిశ్ తెలిపారు. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే మరో పేలుడు శబ్దం వినిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో దాడి కొనసాగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. తాజాగా జరిగిన ఘటన తామే చేశామని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు వెల్లడించారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







