బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన కాబుల్
- December 28, 2017
ఆఫ్గాన్ రాజధాని కాబూల్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. నగరంలోని సాంస్కృతిక కేంద్రంవద్ద గురువారం ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సుమారు 40 మంది చనిపోయినట్లు ఆఫ్గాన్ హోంశాఖ వెల్లడించింది. మరో 30 మందికి పైగా గాయపడ్డారు. బాధితుల్లో విలేకరులు, మహిళలు, చిన్నారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. 'వెంటవెంటనే రెండు పేలుళ్లు సంభవించాయి. ఘటన జరిగిన సమీపంలో ఆఫ్గాన్ వాయిస్ ఏజెన్సీ ఉంది. దాని లక్ష్యంగా చేసుకునే దాడికి పాల్పడి ఉంటారు' అని హోంశాఖ అధికార ప్రతినిధి నజీబ్ దానిశ్ తెలిపారు. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే మరో పేలుడు శబ్దం వినిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో దాడి కొనసాగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. తాజాగా జరిగిన ఘటన తామే చేశామని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు వెల్లడించారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







