బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన కాబుల్

- December 28, 2017 , by Maagulf
బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన కాబుల్

ఆఫ్గాన్‌ రాజధాని కాబూల్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. నగరంలోని సాంస్కృతిక కేంద్రంవద్ద గురువారం ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సుమారు 40 మంది చనిపోయినట్లు ఆఫ్గాన్‌ హోంశాఖ వెల్లడించింది. మరో 30 మందికి పైగా గాయపడ్డారు. బాధితుల్లో విలేకరులు, మహిళలు, చిన్నారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. 'వెంటవెంటనే రెండు పేలుళ్లు సంభవించాయి. ఘటన జరిగిన సమీపంలో ఆఫ్గాన్‌ వాయిస్‌ ఏజెన్సీ ఉంది. దాని లక్ష్యంగా చేసుకునే దాడికి పాల్పడి ఉంటారు' అని హోంశాఖ అధికార ప్రతినిధి నజీబ్‌ దానిశ్‌ తెలిపారు. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే మరో పేలుడు శబ్దం వినిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో దాడి కొనసాగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. తాజాగా జరిగిన ఘటన తామే చేశామని ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు వెల్లడించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com