ట్రిపుల్ తలాక్ బిల్లును ఆమోదించిన లోక్సభ
- December 28, 2017
ట్రిపుల్ తలాక్ బిల్లుకు గురువారం లోక్సభ ఆమోదం తెలిపింది. విస్తృత చర్చ తర్వాత మూజువాణి ఓటుతో ఈ బిల్లును సభ ఆమోదించింది. తలాక్ బిల్లుపై మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సవరణ ప్రతిపాదనలు వీగిపోయాయి. అసదుద్దీన్ సవరణ ప్రతిపాదనలకు మద్దతుగా 2, వ్యతిరేకంగా 241 మంది సభ్యులు ఓటు వేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలమేరకు కేంద్ర ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ బిల్లును రూపొందించిన విషయం తెలిసిందే. ఈ బిల్లుపై సుదీర్ఘ చర్చ తర్వాత లోక్సభ స్పీకర్ సుమిత్రామహాజన్ .. మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, బీజేడీ ఎంపీ బి.హరి, కాంగ్రెస్ ఎంపీ సుష్మితా దేవ్, సీపీఎం సభ్యుడు సంపత్ ఇచ్చిన సవరణ ప్రతిపాదనలపై ఓటింగ్ నిర్వహించారు. సవరణ ప్రతిపాదనలన్నీ వీగిపోయాయి. ఈ సందర్భంగా కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ... ముస్లిం మహిళల కోసమే ఈ బిల్లు తీసుకొస్తున్నామని స్పష్టం చేశారు. ముస్లిం మహిళల హక్కుల కోసం అందరూ ఏకం కాకవాలని పిలుపునిచ్చారు. ఇది రాజకీయాలకు సంబంధించింది కాదు, మానవత్వానికి సంబంధించినదన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!







