తల్లి చనిపోయిన వార్తని విని గుండెపోటుతో మృతి చెందిన ప్రవాస భారతీయుడు
- December 31, 2017
యూఏఈ : నవమాసాలు మోసి, కనిపెంచిన తల్లి మరణాన్ని ఆ కుమారుడు తట్టుకోలేక‘పోయాడు. వేల కిలోమీటర్ల దూరంలో విగతజీవిగా పడి ఉన్న తన మాతృమూర్తి జాలిగొలిపే రూపాన్ని తలచుకొని ఆ ప్రవాసీయుడి గుండె ఆగిపోయింది. స్థానిక ఉమ్ అల్ ఖువేన్ లో గత 20 ఏళ్లుగా ఒక టైలరింగ్ షాప్ లో పని చేస్తున్నకేరళకు చెందిన అనిల్ కుమార్ గోపినాథన్ గత వారం పండుగ రద్దీతో తలమునకలై దుకాణంలో పనిచేసుకొంటున్నాడు. గురువారం తన తల్లి మరణించిన వార్తను అనిల్ కుమార్ గోపినాథన్ కు ఫోన్ లో ఆకస్మికంగా తెలిపారు. ఆ సమాచారం తెలియగానే ఎంతో విచారించి తీవ్రంగా విలపించిన ఆయన అదే రాత్రి దుబాయ్ లో ఉద్యోగం చేసుకొంటున్న తన సోదరుడు సంతోష్ తో కల్సి కేరళలోని కొల్లం జిల్లాలోగల తన ఇంటికి తక్షణమే చేరుకోవాలని తలిచాడు. ఈ నేపథ్యంలో అనిల్ శుక్రవారం విమానంలో స్వదేశానికి చేరుకొనేందుకు ప్రయాణ ఏర్పాట్లు సైతం చేసుకొన్నాడు. కానీ మరుసటి రోజు శుక్రవారం ఉదయం అనిల్ కుమార్ గోపినాథన్ తన గదిలో కుప్పకూలిపోయే పరిస్థితిలో కనుగొన్నారు. వెంటనే స్పందిన అనిల్ మిత్రులు ఆసుపత్రికి తరలించారు కాని వారి ప్రయత్నం ఫలించలేదు. తన తల్లిని కడసారిగా చూద్దామనుకొన్న అనిల్ అత్యంత విషాదంగా తన ప్రాణాలు కోల్పోయి గత శనివారం రాత్రి విగతజీవిగా స్వస్థలం చేరుకోవడం ప్రవాస భారతీయుల హృదయాలను కలిచివేస్తుంది. హతన్మరణావార్తని తెలియనివ్వని నేపథ్యంలో అనిల్ కుమార్ గోపీనాధన్ భార్య మోళీ మరియు కుమార్తె ఆథీరా తిరిగిరాని లోకాలకువెళ్లిన అనిల్ కుమార్ గోపీనాధన్ కోసం ఆదివారం ఉదయం (నేడు ) ఎదురుచూస్తున్నారు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









