తల్లి చనిపోయిన వార్తని విని గుండెపోటుతో మృతి చెందిన ప్రవాస భారతీయుడు
- December 31, 2017
యూఏఈ : నవమాసాలు మోసి, కనిపెంచిన తల్లి మరణాన్ని ఆ కుమారుడు తట్టుకోలేక‘పోయాడు. వేల కిలోమీటర్ల దూరంలో విగతజీవిగా పడి ఉన్న తన మాతృమూర్తి జాలిగొలిపే రూపాన్ని తలచుకొని ఆ ప్రవాసీయుడి గుండె ఆగిపోయింది. స్థానిక ఉమ్ అల్ ఖువేన్ లో గత 20 ఏళ్లుగా ఒక టైలరింగ్ షాప్ లో పని చేస్తున్నకేరళకు చెందిన అనిల్ కుమార్ గోపినాథన్ గత వారం పండుగ రద్దీతో తలమునకలై దుకాణంలో పనిచేసుకొంటున్నాడు. గురువారం తన తల్లి మరణించిన వార్తను అనిల్ కుమార్ గోపినాథన్ కు ఫోన్ లో ఆకస్మికంగా తెలిపారు. ఆ సమాచారం తెలియగానే ఎంతో విచారించి తీవ్రంగా విలపించిన ఆయన అదే రాత్రి దుబాయ్ లో ఉద్యోగం చేసుకొంటున్న తన సోదరుడు సంతోష్ తో కల్సి కేరళలోని కొల్లం జిల్లాలోగల తన ఇంటికి తక్షణమే చేరుకోవాలని తలిచాడు. ఈ నేపథ్యంలో అనిల్ శుక్రవారం విమానంలో స్వదేశానికి చేరుకొనేందుకు ప్రయాణ ఏర్పాట్లు సైతం చేసుకొన్నాడు. కానీ మరుసటి రోజు శుక్రవారం ఉదయం అనిల్ కుమార్ గోపినాథన్ తన గదిలో కుప్పకూలిపోయే పరిస్థితిలో కనుగొన్నారు. వెంటనే స్పందిన అనిల్ మిత్రులు ఆసుపత్రికి తరలించారు కాని వారి ప్రయత్నం ఫలించలేదు. తన తల్లిని కడసారిగా చూద్దామనుకొన్న అనిల్ అత్యంత విషాదంగా తన ప్రాణాలు కోల్పోయి గత శనివారం రాత్రి విగతజీవిగా స్వస్థలం చేరుకోవడం ప్రవాస భారతీయుల హృదయాలను కలిచివేస్తుంది. హతన్మరణావార్తని తెలియనివ్వని నేపథ్యంలో అనిల్ కుమార్ గోపీనాధన్ భార్య మోళీ మరియు కుమార్తె ఆథీరా తిరిగిరాని లోకాలకువెళ్లిన అనిల్ కుమార్ గోపీనాధన్ కోసం ఆదివారం ఉదయం (నేడు ) ఎదురుచూస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







