కూలిన సీ ప్లేన్, ఆరుగురి మృతి
- December 31, 2017
సిడ్నీ నదిలో ఆదివారం నాడు ఒక సీప్లేన్ కూలిన ఘటనలో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. నగరంలో జరుగుతున్న నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా 'వైన్ అండ్ డైన్' అనే ఈ సీ ప్లేన్లో వీరు నగర విహారానికి బయల్దేరారు. ఈ ప్రమాదానికి కారణం కానీ, అందులో మరణించిన ఐదుగురి వివరాలు కానీ తమకు తెలియదని పోలీసులు చెప్పారు. మృతులలో ఆరో వ్యక్తి ఆ విమాన పైలట్ కావటం విశేషం. కాగా మృతులలో నలుగురు బ్రిటన్ జాతీయులని ఆస్ట్రేలియన్ మీడియా తన వార్తా కథనాలలో వెల్లడించినప్పటికీ పోలీసులు మాత్రం దీనిని ధృవీకరించలేదు. అయితే మీడియా కథనాల ఆధారంగా తాము లండన్లోని విదేశీ వ్యవహారాల అధికారులను సంప్రదిస్తున్నట్లు సిడ్నీలోని స్థానిక అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







