కూలిన సీ ప్లేన్, ఆరుగురి మృతి
- December 31, 2017
సిడ్నీ నదిలో ఆదివారం నాడు ఒక సీప్లేన్ కూలిన ఘటనలో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. నగరంలో జరుగుతున్న నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా 'వైన్ అండ్ డైన్' అనే ఈ సీ ప్లేన్లో వీరు నగర విహారానికి బయల్దేరారు. ఈ ప్రమాదానికి కారణం కానీ, అందులో మరణించిన ఐదుగురి వివరాలు కానీ తమకు తెలియదని పోలీసులు చెప్పారు. మృతులలో ఆరో వ్యక్తి ఆ విమాన పైలట్ కావటం విశేషం. కాగా మృతులలో నలుగురు బ్రిటన్ జాతీయులని ఆస్ట్రేలియన్ మీడియా తన వార్తా కథనాలలో వెల్లడించినప్పటికీ పోలీసులు మాత్రం దీనిని ధృవీకరించలేదు. అయితే మీడియా కథనాల ఆధారంగా తాము లండన్లోని విదేశీ వ్యవహారాల అధికారులను సంప్రదిస్తున్నట్లు సిడ్నీలోని స్థానిక అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- లోక్సభ స్పీకర్ పై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం..
- టీమ్ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా..
- సౌదీ రక్షణ దళాల చర్య: బాలిస్టిక్ క్షిపణి, రెండు డ్రోన్లు నిర్వీర్యం
- గ్యాస్ వినియోగదారులకు షాక్
- విదేశాల్లో ఇరానీయులకు హెచ్చరిక, దేశద్రోహం చేస్తే మరణశిక్ష
- రాత్రి సమయంలో ఎమర్జెన్సీ అలర్ట్ సౌండ్ లో మార్పు
- అబుదాబి నుండి భారత్కు ఎతిహాద్ విమానాలు–నేటి షెడ్యూల్
- మనామాలో నివాస భవనం పై ఇరాన్ దాడి: ఒకరు మృతి, పలువురికి గాయాలు
- కమ్యూనిటీ వర్చువల్ సమావేశం నిర్వహించిన భారత రాయబారి..!!
- అత్యవసర హెచ్చరికలు.. ప్రజలకు సౌదీ అరేబియా అప్పీల్..!!









