కూలిన సీ ప్లేన్, ఆరుగురి మృతి
- December 31, 2017
సిడ్నీ నదిలో ఆదివారం నాడు ఒక సీప్లేన్ కూలిన ఘటనలో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. నగరంలో జరుగుతున్న నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా 'వైన్ అండ్ డైన్' అనే ఈ సీ ప్లేన్లో వీరు నగర విహారానికి బయల్దేరారు. ఈ ప్రమాదానికి కారణం కానీ, అందులో మరణించిన ఐదుగురి వివరాలు కానీ తమకు తెలియదని పోలీసులు చెప్పారు. మృతులలో ఆరో వ్యక్తి ఆ విమాన పైలట్ కావటం విశేషం. కాగా మృతులలో నలుగురు బ్రిటన్ జాతీయులని ఆస్ట్రేలియన్ మీడియా తన వార్తా కథనాలలో వెల్లడించినప్పటికీ పోలీసులు మాత్రం దీనిని ధృవీకరించలేదు. అయితే మీడియా కథనాల ఆధారంగా తాము లండన్లోని విదేశీ వ్యవహారాల అధికారులను సంప్రదిస్తున్నట్లు సిడ్నీలోని స్థానిక అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







