కెన్యాలో ఘోర రోడ్డు ప్రమాదం, 30 మంది మృతి
- December 31, 2017
సెంట్రల్ కెన్యాలో ఆదివారం జరిగిన ఓ ఘోర రోడ్డు ప్రమాదంలో 30 మంది మరణించగా మరో 16 మందికి పైగా గాయపడ్డారని పోలీసులు చెప్పారు. సెంట్రల్ కెన్యాలో నకురు పట్టణం వద్ద స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 3 గంటల సమయంలో ఒక బస్సు, లారీ ఢకొీన్న ఈ ప్రమాదంలో 30 మంది మర ణించారని రిఫ్ట్ వ్యాలీ ట్రాఫిక్ పోలీస్ చీఫ్ జెరో అరోమ్ చెప్పారు. శిథిలాల నుండి మృతదేహాలను తొలగించి, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని ఆయన వివరిం చారు. కెన్యా పశ్చిమ ప్రాంతంలోని బుసియా నుండి ఈ బస్సు ప్రయాణిస్తున్న నకురు ఎల్డోరెట్ హైవైపై ప్రమాదకరమైన మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వివరించారు. ఈ మలుపు వద్ద ఈ నెలరోజుల వ్యవధిలో జరిగిన ప్రమాదాలలో మరణించిన వారి సంఖ్య 100కు చేరిందన్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







