కెన్యాలో ఘోర రోడ్డు ప్రమాదం, 30 మంది మృతి
- December 31, 2017
సెంట్రల్ కెన్యాలో ఆదివారం జరిగిన ఓ ఘోర రోడ్డు ప్రమాదంలో 30 మంది మరణించగా మరో 16 మందికి పైగా గాయపడ్డారని పోలీసులు చెప్పారు. సెంట్రల్ కెన్యాలో నకురు పట్టణం వద్ద స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 3 గంటల సమయంలో ఒక బస్సు, లారీ ఢకొీన్న ఈ ప్రమాదంలో 30 మంది మర ణించారని రిఫ్ట్ వ్యాలీ ట్రాఫిక్ పోలీస్ చీఫ్ జెరో అరోమ్ చెప్పారు. శిథిలాల నుండి మృతదేహాలను తొలగించి, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని ఆయన వివరిం చారు. కెన్యా పశ్చిమ ప్రాంతంలోని బుసియా నుండి ఈ బస్సు ప్రయాణిస్తున్న నకురు ఎల్డోరెట్ హైవైపై ప్రమాదకరమైన మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వివరించారు. ఈ మలుపు వద్ద ఈ నెలరోజుల వ్యవధిలో జరిగిన ప్రమాదాలలో మరణించిన వారి సంఖ్య 100కు చేరిందన్నారు.
తాజా వార్తలు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!
- బహ్రెయిన్ లో ప్రవాస ఇంజనీర్ల అర్హతల పై సమీక్ష..!!
- సాయుధ దళాల ధైర్య సాహసాలను ప్రశంసించిన కౌన్సిల్..!!
- డ్రోన్ ఆపరేట్..పోలీసుల అదుపులో ఐదుగురు..!!
- కువైట్ పై ఆరు డ్రోన్లతో దాడి..కూల్చేసిన సైన్యం..!!
- ప్రాంతీయ పరిణామాల పై జీసీసీ అత్యవసర సదస్సు..!!
- విజిటర్స్ కు గైడ్ లైన్స్ జారీ చేసిన ఖతార్..!!
- యూఏఈకి సంతాపం తెలిపిన ఒమన్..!!









