మానసిక రోగి పోలీసుపై కత్తితో దాడి .. పోలీస్ మృతి
- January 01, 2018
మస్కట్ : ఒమన్ రాజధాని మస్కట్ లో అత్యంత అరుదైన ఒక దాడిలో పోలీస్ శనివారం ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపాడు. విధి నిర్వహణలో ఉన్న పోలీసును కత్తితో పొడిచి ఆ దుండగుడు హతమార్చాడు. ఆ హంతకుడు "మానసికంగా అనారోగ్యం" గా ఉన్నట్లు అభివర్ణించారు .పోలీసుపై దాడిచేసిన వ్యక్తి మస్కట్ షాపింగ్ సెంటర్ వద్ద ఉన్న పోలీసును కత్తితో పొడిచి గాయపరిచాడు. ఆ నిందితుడు మానసికంగా అనారోగ్యంతో ఉన్నాడని సూచించే ఒక పత్రం తమ స్వాధీనంలో ఉందని పోలీసులు తెలిపారు. స్థానిక టీవీ ఛానెల్ తో ఒక పోలీస్ అధికారి మాట్లాడుతూ " నిందితుని అనుమానాస్పద ప్రవర్తన గురించి పిర్యదు తీసుకొన్న పోలీసులు షాపింగ్ సెంటర్ వద్దకు వెళ్లారు. అక్కడ అనుమానితుడు ఒక ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ వద్ద ఒక వ్యక్తితో తగాదా పడుతున్నాడు దీనితో అడ్డుకోబోయిన పోలీసును .అనుమానితుడు ఒక కత్తిని వెలుపలకు లాగి ఆ పోలీస్ అధికారిని బలంగా పొడిచాడు. ప్రాణాంతక గాయంతో ఆ పోలీస్ అధికారి విలవిలాడుతుండగా . మరో ఇద్దరు అధికారులను సైతం కత్తితో పొడిచాడని తెలిపారు. ఎట్టకేలకు ఆ దాడిని అడ్డుకొని నిందితుడిని అరెస్టు చేశారు. ఒమన్ లో నేరాల సంఖ్య అతి తక్కువగా నమోదుకావడంతో ఈ కత్తిపోట్ల వ్యవహారం స్థానికంగా సంచలనం కల్గించింది.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!